Sunday, 07 June 2026 07:44:16 AM
# బిజెపి పార్టీ సీనియర్ నాయకులు సొప్పరి క్రాంతి ఆధ్వర్యంలో గౌతంపూర్ లో మొక్కలు నాటడం జరిగినది. # ఈ నెల 7, 8 తేదీల్లో రెండు రోజులపాటు ఎఐటీయూసీ సెంట్రల్ కౌన్సిల్ సమావేశం. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి. # మున్సిపల్ కార్పొరేషన్‌లో సిపిఐ పక్ష బలాన్ని సమర్థవంతంగా చాటాలి.కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు # నామా వినోద్‌పై దాడి చేసిన భూకబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. # మీసేవ దరఖాస్తుల పరిశీలన పూర్తిగా ఆన్‌లైన్‌లోనే. జీపీఓలు, ఆర్‌ఐలకు అవగాహన కల్పించిన ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ సైదేశ్వరరావు. # ప్రజల ప్రాణ రక్షణకు ముందస్తు చర్యలు చేపట్టాలి. గోదావరి వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మరో రెండు రోజుల్లో రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకనున్న నేపథ్యంలో జిల్లాలో వరి కొనుగోలు ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలి. # భద్రాచలం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అయ్యప్ప కాలనీ, రెవిన్యూ కాలనీల్లో కార్డాన్ అండ్ సెర్చ్ ఆపరేషన్. # విద్యార్థులు సాంస్కృతిక పోటీల్లో రాణించాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # పెట్రోలింగ్,బ్లూ కోల్డ్స్ వాహనాలతో సంచరిస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మాస్టర్ ఈ .కె ఆధ్యాత్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో కాకర్ల గ్రామం నందు ఉచిత హోమియో వైద్య శిబిరం. # భూభారతి, సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సెంట్రల్ పార్కులో ప్లాస్టిక్ ఏరివేత -మొక్కలు నాటిన ఎస్ జి ఎఫ్. # కొత్తగూడెం ఇల్లందు రహదారిపై స్కూటీని ఢీకొన్న లారీ. # పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ధరల పెరుగుదలపై రాజీలేని పోరాటం చేద్దాం.సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # గోపన్నగూడెంలో మినీ మేడారం జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే జారె. # జనగణన జాబితా వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేలా ఉండాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # సమున్నత ఆశయాలతోనే భారత జాతీయ మహిళా సమాఖ్య ఆవిర్భావం. భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి మున్నా లక్ష్మీకుమారి. # ప్రజా సమస్యల పరిష్కార మార్గాన్ని చూపే విధంగా గ్రామ సభలు ఉండాలి. 16వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ.

దిశా సర్వసభ్య సమావేశంలో అభివృద్ధి పనులపై సమగ్ర సమీక్ష, తాగునీరు, వైద్యం, మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి

Date : 08 April 2026 06:12 PM Views : 136

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : దిశా సర్వసభ్య సమావేశంలో అభివృద్ధి పనులపై సమగ్ర సమీక్ష – ఖమ్మం పార్లమెంటు సభ్యులు రామ సహాయం రఘు రామ్ రెడ్డి. తాగునీరు, వైద్యం, మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి – మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు పోరిక బలరాం నాయక్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దిశా సర్వసభ్య సమావేశం బుధవారం జిల్లా కేంద్ర ఐడీఓసీ కార్యాలయంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ఈ సమావేశానికి ఎంపీ రామ సహాయం రఘు రామ్ రెడ్డి అధ్యక్షత వహించారు, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ కో-చైర్మన్‌గా పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ అంకిత్, అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు, కొత్తగూడెం మున్సిపల్ మేయర్ మూడ్ గణేష్, అటవీ శాఖ అధికారి కృష్ణ గౌడ్, దిశా కమిటీ సభ్యులు, సంబంధిత శాఖల జిల్లా అధికారులు హాజరయ్యారు. సమావేశంలో గత దిశా కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు, వివిధ శాఖల అభివృద్ధి పనుల పురోగతి సమగ్రంగా సమీక్షించబడింది. ఎంపీ రామ సహాయం రఘు రామ్ రెడ్డి జిల్లా అభివృద్ధి పనులను నిర్దిష్ట గడువుల్లో పూర్తి చేయాలని, ప్రతి శాఖ తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, పనుల పురోగతిని నివేదికల రూపంలో ఎప్పటికప్పుడు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్ పనులను వేగవంతం చేసి, గత నిర్ణయాలను తప్పనిసరిగా అమలు చేయాలని స్పష్టంగా సూచించారు. ఖమ్మం పార్లమెంటు సభ్యులు రామసహాయం రఘురామరెడ్డి మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం లో భాగంగా గతంలో కేంద్ర ప్రభుత్వం 90 శాతం నిధులు ఇస్తుందని, ఇప్పుడు కేవలం 60 శాతం మాత్రమే ఇచ్చే విధంగా మార్పు వచ్చి, మిగిలిన 40 శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. అదేవిధంగా గృహ నిర్మాణ శాఖలో అనేక మార్పులు రావడం వలన పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో సమస్యలు తలెత్తుతున్నాయని, ఈ సమస్యల పరిష్కారం కోసం సమగ్ర చర్చ జరిగిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కీలకమని, ప్రతి పథకం లక్ష్యాలకు అనుగుణంగా లబ్ధిదారులకు సమయానికి ప్రయోజనాలు చేరేలా పర్యవేక్షణ పెంచాలని సూచించారు. వేసవి కాలంలో తాగునీటి సరఫరా, వైద్య సేవలు, విద్యుత్ వంటి ప్రాథమిక సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు. మణుగూరు, ఇల్లందు, భద్రాచలం, కొత్తగూడెం తదితర ప్రాంతాల ప్రభుత్వ ఆసుపత్రుల పరిశుభ్రత, ఆహార నాణ్యత, మరుగుదొడ్ల నిర్వహణ, అంబులెన్స్, డయాలసిస్ సేవల విస్తరణ, సికిల్ సెల్ అనీమియా, హెచ్పీవీ వ్యాక్సిన్ అవగాహన కార్యక్రమాలపై అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలి అని సూచించారు. మిషన్ భగీరథ, అమృత్ పథకాల కింద తాగునీటి సరఫరా మరియు పైప్‌లైన్‌లీకేజీలను తొలగించడానికి ముందస్తు చర్యలు తీసుకోవాలని, మున్సిపాలిటీలలో త్రాగునీటి సరఫరా పనులను సమయానికి పూర్తి చేయాలని ఆదేశించారు. జాతీయ రహదారులు, ఆర్ & బి, విద్యుత్ శాఖల పనుల ఆలస్యంపై ఆగ్రహం వ్యక్తం చేసి, ఐటీడీఎ నిధులతో చేపట్టిన పనులలో ఆలస్యానికి కారణాలను వివరించాలని అధికారులు నివేదికలు సమర్పించాలని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో కేంద్ర నిధులను సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు.

మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ మాట్లాడుతూ , కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై సమగ్రంగా చర్చించి, అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని, మారుమూల ప్రాంతాల వరకు త్రాగునీటి సరఫరా కల్పించాలని, ఆసుపత్రుల్లో అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, అభివృద్ధి పనులను నిర్దిష్ట గడువుల్లో పూర్తి చేయడం కోసం సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. దిశా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ప్రాధాన్యతగా తీసుకుని వాటి అమలును వేగవంతం చేయాలని, ప్రతి శాఖ తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు సకాలంలో చేరేలా పర్యవేక్షణ మరింత బలోపేతం చేయాలని, పనుల నాణ్యతపై ఎటువంటి రాజీ పడకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని తాగునీటి సరఫరా, వైద్య సేవలు, విద్యుత్ వంటి ప్రాథమిక సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. శాసన సభ్యులు తమ నియోజకవర్గ పరిధిలో అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాల పురోగతిపై అధికారులు సమగ్ర వివరణ ఇవ్వాలని కోరారు. అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు తదితరులు తమ నియోజకవర్గాల్లో పథకాల అమలు స్థితిగతులపై అధికారుల నుంచి సవివర నివేదికలు కోరారు. ఈ సమావేశంలో ఇల్లందు మున్సిపల్ చైర్ పర్సన్ దొడ్డ కిరణ్ మిత్ర, అశ్వరావుపేట మున్సిపల్ చైర్ పర్సన్ శశికళ, డి ఆర్ డి ఓ విద్యా చందన, జడ్పీ సీఈవో నాగలక్ష్మి, కొత్తగూడెం ఆర్డీవో మధు, దిశా కమిటీ సభ్యులు బుర్ర సురేష్, యేసుమని, స్వర్ణ జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :