తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం ఏప్రిల్ 1 తెలుగు వెలుగు) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా 02 ఏప్రిల్ 2026 న ఉదయం 9:00 గంటలకు మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో గ్రామసభలు నిర్వహించ బడతాయని మండల అభివృద్ధి అధికారి తాళ్లూరి రవి మీడియా ద్వారా ప్రకటించారు. ఈ గ్రామసభలలో ప్రభుత్వ సంక్షేమ పథకాలపై చర్చించడం జరుగుతుంది. ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి పేదవారికి అందే విధంగా ఈ గ్రామ సభలు నిర్వహించబడతాయి అందువలన క్రింది పథకాల లబ్ధిదారులు మరియు అర్హులైన ప్రజలందరూ తప్పనిసరిగా గ్రామ సభలకు హాజరుకావలసిందిగా మండల ప్రజలను కోరారు. కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, గృహజ్యోతి (200 యూనిట్ల ఉచిత విద్యుత్తు), రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు రుణమాఫీ, బోనస్ సన్న బియ్యం, మహాలక్ష్మి పథకం, సబ్సిడీ గ్యాస్, కళ్యాణ లక్ష్మి / షాది ముబారక్, అలాగే గ్రామ ప్రజలందరూ గ్రామసభలకు హాజరై తమ అభిప్రాయాలు, సమస్యలు తెలియజేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ