తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : చదువుతోనే సమాజ మార్పు సాధ్యమవుతుందని, బామ్ సెఫ్ నేషనల్ క్యాడర్, తెలంగాణ ఇంచార్జ్ నల్ల శ్రీధర్ అన్నారు. ఆదివారం రామవరం లోని ఎస్సిబి నగర్ మోడర్న్ ఇక్రా స్కూల్లో జరిగిన బామ్ సెఫ్ క్యాడర్ క్యాంపులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. చరిత్ర లో ఏంజరిగింది, జరుగుతుంది, జరగబోతుంది అనే విషయాల పైన అవగాహనను పెంచుకోవాలన్నారు. చరిత్ర, సమాజం ఎడల మిడిమిడి జ్ఞానం చాలా నష్ట దాయకమని తెలిపారు. విద్య లేకపోతే, విజ్ఞానం లేకుండాపోతోంది, విజ్ఞానం లేకపోతే నైతికధ లేకుండా పోతుంది, నైతికత లేకపోతే ఐక్యత లేకుండా పోతుందన్నారు. భారతదేశ సామాజిక ఉద్యమకారులైన వారిని నిత్యం మన నం చేసుకోవాలన్నారు.బిర్సా ముండ ఆధ్వర్యంలో 17వ శతాబ్దంలోనే మాభూమి మాదేనంటూ, స్వాతంత్ర ఉద్యమం నడిపి విముక్తి కోసం పోరాటం చేసిన ఘనత మనకి ఉందన్నారు. కేరళలో నారాయణ గురు ప్రజలందరినీ గుడులకు అనుమతించాలని ఉద్యమించడమే కాకుండా, వందలాది గుడులను నిర్మించి విద్య నేర్పించారని తెలిపారు. 1902లోనే మొదటిసారి 50% రిజర్వేషన్లను అమలు చేసిన సాహు మహారాజ్ ఆదర్శనీయుడన్నారు. మద్రాస్ లో పెరియార్ ఇ.వి.రామసామి నేతృత్వంలోనే అందరికీ సమానత్వాన్ని అమలు చేశారన్నారు. రాష్ట్ర పిత జ్యోతిబా పూలే ఆధ్వర్యంలో 200 సంవత్సరాల క్రితమే బాలికలకు పాఠశాలలు నిర్మించి విద్యను అందించారని వెల్లడించారు. వీరందరికీ ఆదర్శమైన గౌతమ బుద్ధుడు మానవతా విలువలను, మనిషి జీవన విధానాన్ని, నైతిక విలువలను బోధించడమే కాకుండా, ప్రపంచ మొట్టమొదటి సామాజిక విప్లవకారుడుగా పేరుగాంచి అభివృద్ధికర సమాజానికి బాటలు వేశారన్నారు. బుద్ధిజాన్ని ఎల్లలు దాటించిన సామ్రాట్ అశోక అడుగుజాడల్లో నడిచిన డాక్టర్. బి.ఆర్ అంబేద్కర్, గౌతమ బుద్ధున్నీ , రాష్ట్ర పిత పూలేని గురువులుగా ప్రకటించుకొని, ప్రపంచ విద్యావంతుడుగా పేరుగాంచి, అందరికీ సమానత్వాన్ని పంచే రాజ్యాంగాన్ని మనకి అందించారన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో రాజ్యాంగం ఉండాలని శ్రీధర్ అన్నారు. కాగా క్యాడర్ క్యాంపకు ముందు మొక్కల వెంకటయ్య, మొక్కల రాజశేఖర్, మొక్కల ప్రేమికుడు చిరంజీవి ఆఫాన్, సంతోష్ కుమార్లు అతిథులకు మొక్కలు అందించి స్వాగతం పలికారు. అనంతరం క్యాంప్ కు గుర్తుగా బాసిత్ నేతృత్వంలోసుగుణారావు, ఎస్ వెంకటేశ్వర్లు, గోనె శ్రీకాంత్, బాలశౌరి, మల్లెల రామనాథం, కొండ పెద్దన్న, శివ, నబీ సాహెబ్, పర్వీన్, వేంకటముత్యం, కృష్ణయ్య , ఛత్రునా యక్, ప్రసాద్ లు స్కూల్లో మొక్కలను నాటారు.
Admin
తెలుగు వెలుగు టీవీ