తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రపంచ ఓజోన్ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (TGPCB), ప్రాంతీయ కార్యాలయం, కొత్తగూడెం ఆధ్వర్యంలో ప్రధాన పరిశ్రమల ప్రతినిధులతో అవగాహన కార్యక్రమాన్ని M/s. నవభారత్ వెండర్స్ లిమిటెడ్, పాల్వంచ ప్రాంగణంలో నిర్వహించారు.. ఈ సందర్భంగా తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి వారు ఓజోన్ పొర ప్రాముఖ్యత, దాని పరదక్షిణ అవసరం మరియు పర్యావరణంపై ఓజోన్ శ్రీణత వల్ల కలిగి ప్రభావాలపై వివిధ పరిశ్రమల ప్రతినిధులకు అవగాహన కల్పించారు. భూమికి సుమారు 15-35 కిలోమీటర్ల ఎత్తులోని స్ట్రాటోస్పియర్లో అధిక సాంద్రతలో ఉండే ఓజోన్ పొర సూర్యుని నుంచి వచ్చే హానికరమైన అతినీలలోహిత (UV) కిరణాలకు సహజ రక్షణ కవచంగా పనిచేస్తుందనీయు మరియు ముఖ్యంగా LV-B కిరణాల అధిక ప్రభావం నుంచి మానవులు, జంతువులు, మొక్కలు మరియు ఇతర జీవరాశులను రక్షించడంలో ఓజోన్ పొర కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. భూమిపై జీవరాశుల (BERS) మనుగడకు ఓజోన్ పొర అత్యంత ముఖ్యమైనదని తెలిపారు. ఓజోన్ పొర క్షీణించడం వల్ల భూమి ఉపరితలానికి చేరి UV-B కిరణాల పరిమాణం పెరిగి, మానవ ఆరోగ్యంతో పాటు పంటలు, మొక్కలు, సూక్కజెవులు మరియు అల పర్యావరణ వ్యవస్థలపై ప్రతికూల ప్రభావాలు ఏర్పడే అవకాశం ఉందని అన్నారు. ఆహార గొలుసులు మరియు పర్యావరణ వ్యవస్థల పరిరక్షణలో కూడా ఓజోన్ పొర ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా 2026 ప్రపంచ ఓజోన్ దినేత్సవం "Global Action for a Cooler Planet-Celebrating 10 years of sustainable cooling under the Kigali Amendment to the Montreal Protocol ఆనే ఇతివృత్తంతో నిర్వహించబడుతున్నట్లు వివరించారు. కిగాలీ సవరణ ద్వారా HFC U దశలవారీ దగ్గింపు, పర్యావరణహితమైన మరియు ఇంధన సామర్థ్యం కలిగిన శీతలీకరణ సాంకేతికలను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని వివరించారు.. పరిశ్రమలు ఓజోన్ పొండు క్షీణింపజేసి పదార్ధాల వినియోగాన్ని నియంపొంచుడం పర్యావరణహిత ప్రత్యామ్నాయ సాంకేతికతలను అచలాభించడం, శీతలీకరణ పరికరాల నిర్వహణలో పర్యావరణ ప్రమాణాలను పాటించడం మరియు ఇందన సామర్థ్యాన్ని పెంపొందించడం ద్వారా ఓజోన్ పొర పరిరక్షణలో. తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని సూచించారు. "ఓజోన్ పొరను కాపాడటం కంటే భూమిపై జీవరాశులను, పర్యావరణ వ్యవస్థలను మరియు భవిష్యత్ తరాలను కాపాడటం" అనే సందేశాన్ని ఈ కార్యక్రమంలో ప్రధానంగా వివరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి అధికారులు M/s. నవభారత్ వెంచర్స్ లిమిటెడ్ ప్రతినిథులు, M/s. యస్ ప్రతినరులు మరియు పరిసర ప్రాంతంలోని ప్రధాన పరిశ్రమల ప్రతినిథులు సుమారుగా 100 మంది పాల్గొనడం జరిగింది.
Admin
తెలుగు వెలుగు టీవీ