తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : విద్యాహక్కు చట్టం 2009 ను అమలు చేయాలనే డిమాండ్ తో ఈనెల 6వ తేదీన కలెక్టర్ కార్యాలయం ఎదుట జరుగు ధర్నాను జయప్రదం చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ కోరారు.శుక్రవారం పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21A ప్రకారం దేశంలోని 6 నుండి 14 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలకు ఉచిత మరియు నిర్బంధ విద్యను అందించాల్సి ఉండగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విద్యను నిర్వీర్యం చేసే కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.ఎస్సీ,ఎస్.టి,బీసీ,దివ్యాంగులకు ప్రైవేటు విద్యాసంస్థలలో 25% రిజర్వేషన్ కల్పించాలని,2009 లో చట్టం చేసిన విద్యాహక్కు చట్టాన్ని ఏ ప్రైవేట్ పాఠశాలలు అమలు చేయడం లేదని ఆరోపించారు.పాలకులే పాఠశాలలు,కళాశాలలు నిర్వహిస్తూ ఉండటం చేత అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఇది సరైంది కాదన్నారు.విద్యాహక్కు చట్టం 2009(RTE)అమలు కొరకు దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గంధం మల్లికార్జునరావు,జిల్లా ప్రధాన కార్యదర్శి వీరు నాయక్,కార్మిక విభాగం జిల్లా అధ్యక్షులు సాయి,వంగా రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ