తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా మిలాద్ - ఉన్ - నబీ సందర్బంగా గురువారం కొత్తగూడెం పట్టణంలోని రైల్వే స్టేషన్ వద్ద అహలే సున్నత్ వల్ జమాత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా పాల్గొన్న కొత్తగూడెం డిఎస్పి రెహమాన్, సిపిఐ జిల్లా కార్యదర్శి సాబిర్ పాషా లతో కలిసి టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇస్లాం మత విశ్వాసాల ప్రకారం, అల్లాహ్ ప్రపంచ శాంతి కోరుతూ చివరి ప్రవక్తగా మహమ్మద్ ఎంపికయ్యాడని, ముస్లింలందరూ అత్యంత పవిత్ర గ్రంథంగా భావించే ఖురాన్ గ్రంథంలో వీటి గురించి పేర్కొనబడిందని తెలిపారు. మహమ్మద్ ప్రవక్తను విశ్వశాంతి కోసం అల్లాహ్ నియమించారని, అందుకే తను జన్మించిన రోజున ఆయనను స్మరించుకుంటూ మిలాద్-ఉన్-నబీ పండుగను జరుపుకుంటారని పేర్కొన్నారు. ఆయన చూపిన మార్గంలో యువత ముందుకెళ్ళాలని హిందువులకు భగవద్గీత, క్రిష్టియన్ లకు బైబిల్, ముస్లిం లకు ఖురాన్ బోధించేది శాంతి సందేశమేనని ఆయన అన్నారు.నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిఎస్పీ రాష్ట్ర నాయకుడు యెర్రా కామేష్ , మాజీ కౌన్సిలర్, అహలే సున్నతుల్ జమాత్ పట్టణ అధ్యక్షులు రజాక్, ప్రధాన కార్యదర్శి న్యాయవాది సాదిక్ పాషా,మైనారిటీ రాష్ట్ర నాయకులు రహీంఖురేషి,టీపీసీసీ సభ్యులు జెబి శౌరి, మొత్కూరి ధర్మారావు, మైనారిటీ జిల్లా అధ్యక్షులు, ఉపాధ్యక్షులు మహమ్మద్ ఖాన్,ఎండి కరీం పాషా, ఓబీసీ జిల్లా పట్టణ అధ్యక్షులు అల్లుడి.నర్సింహారావు,జయప్రకాష్, EX Mptc కసనబోయిన.భద్రం, ఆన్వర్, గౌస్, మాజీ కౌన్సిలర్ యూసుఫ్, కౌన్సిలర్ ధర్మారావు, దస్తగీర్, రాజశేఖర్,సురేష్,రహమాన్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ