Sunday, 02 August 2026 09:09:10 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

మహమ్మద్ ప్రవక్త చూపిన శాంతి మార్గం ఆదర్శనీయం టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు

Date : 19 September 2024 08:01 PM Views : 559

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా మిలాద్ - ఉన్ - నబీ సందర్బంగా గురువారం కొత్తగూడెం పట్టణంలోని రైల్వే స్టేషన్ వద్ద అహలే సున్నత్ వల్ జమాత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా పాల్గొన్న కొత్తగూడెం డిఎస్పి రెహమాన్, సిపిఐ జిల్లా కార్యదర్శి సాబిర్ పాషా లతో కలిసి టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇస్లాం మత విశ్వాసాల ప్రకారం, అల్లాహ్ ప్రపంచ శాంతి కోరుతూ చివరి ప్రవక్తగా మహమ్మద్ ఎంపికయ్యాడని, ముస్లింలందరూ అత్యంత పవిత్ర గ్రంథంగా భావించే ఖురాన్ గ్రంథంలో వీటి గురించి పేర్కొనబడిందని తెలిపారు. మహమ్మద్ ప్రవక్తను విశ్వశాంతి కోసం అల్లాహ్ నియమించారని, అందుకే తను జన్మించిన రోజున ఆయనను స్మరించుకుంటూ మిలాద్-ఉన్-నబీ పండుగను జరుపుకుంటారని పేర్కొన్నారు. ఆయన చూపిన మార్గంలో యువత ముందుకెళ్ళాలని హిందువులకు భగవద్గీత, క్రిష్టియన్ లకు బైబిల్, ముస్లిం లకు ఖురాన్ బోధించేది శాంతి సందేశమేనని ఆయన అన్నారు.నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిఎస్పీ రాష్ట్ర నాయకుడు యెర్రా కామేష్ , మాజీ కౌన్సిలర్, అహలే సున్నతుల్ జమాత్ పట్టణ అధ్యక్షులు రజాక్, ప్రధాన కార్యదర్శి న్యాయవాది సాదిక్ పాషా,మైనారిటీ రాష్ట్ర నాయకులు రహీంఖురేషి,టీపీసీసీ సభ్యులు జెబి శౌరి, మొత్కూరి ధర్మారావు, మైనారిటీ జిల్లా అధ్యక్షులు, ఉపాధ్యక్షులు మహమ్మద్ ఖాన్,ఎండి కరీం పాషా, ఓబీసీ జిల్లా పట్టణ అధ్యక్షులు అల్లుడి.నర్సింహారావు,జయప్రకాష్, EX Mptc కసనబోయిన.భద్రం, ఆన్వర్, గౌస్, మాజీ కౌన్సిలర్ యూసుఫ్, కౌన్సిలర్ ధర్మారావు, దస్తగీర్, రాజశేఖర్,సురేష్,రహమాన్ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :