తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రపంచ పర్యావరణ దినోత్సవo సందర్భంగా అదేవిధంగా 12 సంవత్సరాలుగా వికసిత్ భారత్ సుపరిపాలన అందిస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బిజెపి పార్టీ సీనియర్ నాయకులు సొప్పరి క్రాంతి ఆధ్వర్యంలో గౌతంపూర్ లో మొక్కలు నాటడం జరిగినది, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బిజెపి పార్టీ జిల్లా కౌన్సిల్ మెంబర్ పొన్నగంటి రాజు పాల్గొన్నారు, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని మొక్కలు నాటడం వలన వర్షాలు సమయానికి కురుస్తాయని దానివల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుంది అని , రైతు బాగుంటే దేశం బాగుంటుంది అని, ప్రధానమంత్రి పిలుపుమేరకు ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలని పిలుపునివ్వడం జరిగినది,ఈ కార్యక్రమంలో మహిళ మండల అధ్యక్షురాలు స్వప్న, మండల ప్రధాన కార్యదర్శి రతన్ లాల్, గౌతంపూర్ వార్డ్ మెంబర్స్ గుత్తుల తరుణ్, ప్రియాంక, యువ మోర్చా నాయకులు మహేష్ ,అనిల్, తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ