Sunday, 07 June 2026 08:47:31 AM
# బిజెపి పార్టీ సీనియర్ నాయకులు సొప్పరి క్రాంతి ఆధ్వర్యంలో గౌతంపూర్ లో మొక్కలు నాటడం జరిగినది. # ఈ నెల 7, 8 తేదీల్లో రెండు రోజులపాటు ఎఐటీయూసీ సెంట్రల్ కౌన్సిల్ సమావేశం. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి. # మున్సిపల్ కార్పొరేషన్‌లో సిపిఐ పక్ష బలాన్ని సమర్థవంతంగా చాటాలి.కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు # నామా వినోద్‌పై దాడి చేసిన భూకబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. # మీసేవ దరఖాస్తుల పరిశీలన పూర్తిగా ఆన్‌లైన్‌లోనే. జీపీఓలు, ఆర్‌ఐలకు అవగాహన కల్పించిన ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ సైదేశ్వరరావు. # ప్రజల ప్రాణ రక్షణకు ముందస్తు చర్యలు చేపట్టాలి. గోదావరి వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మరో రెండు రోజుల్లో రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకనున్న నేపథ్యంలో జిల్లాలో వరి కొనుగోలు ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలి. # భద్రాచలం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అయ్యప్ప కాలనీ, రెవిన్యూ కాలనీల్లో కార్డాన్ అండ్ సెర్చ్ ఆపరేషన్. # విద్యార్థులు సాంస్కృతిక పోటీల్లో రాణించాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # పెట్రోలింగ్,బ్లూ కోల్డ్స్ వాహనాలతో సంచరిస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మాస్టర్ ఈ .కె ఆధ్యాత్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో కాకర్ల గ్రామం నందు ఉచిత హోమియో వైద్య శిబిరం. # భూభారతి, సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సెంట్రల్ పార్కులో ప్లాస్టిక్ ఏరివేత -మొక్కలు నాటిన ఎస్ జి ఎఫ్. # కొత్తగూడెం ఇల్లందు రహదారిపై స్కూటీని ఢీకొన్న లారీ. # పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ధరల పెరుగుదలపై రాజీలేని పోరాటం చేద్దాం.సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # గోపన్నగూడెంలో మినీ మేడారం జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే జారె. # జనగణన జాబితా వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేలా ఉండాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # సమున్నత ఆశయాలతోనే భారత జాతీయ మహిళా సమాఖ్య ఆవిర్భావం. భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి మున్నా లక్ష్మీకుమారి. # ప్రజా సమస్యల పరిష్కార మార్గాన్ని చూపే విధంగా గ్రామ సభలు ఉండాలి. 16వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ.

భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది.

Date : 18 April 2026 08:29 PM Views : 104

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్,హేమచంద్రపురం నందు శనివారం Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది.ఈ సమీక్షా సమావేశంలో జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల నుండి స్టేషన్ హౌస్ ఆఫీసర్లు, సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు,కోర్టు డ్యూటీ ఆఫీసర్లు,కోర్టు లైజన్ ఆఫీసర్లు మరియు ప్రాసిక్యూషన్ ఆఫీసర్లు పాల్గొన్నారు.ఈ సమావేశంలో గడిచిన ఫిబ్రవరి మరియు మార్చి నెలల్లో కోర్టుల్లో విచారణకు వచ్చిన కేసులపై సమగ్రంగా సమీక్ష నిర్వహించబడింది. ముఖ్యంగా కన్విక్షన్,అక్విటల్ (Acquittal) కేసుల పురోగతిని విశ్లేషిస్తూ,కేసుల దర్యాప్తులో ఉన్న లోపాలు,సవాళ్లు మరియు మెరుగుదలకు అవసరమైన అంశాలపై చర్చ జరిగింది.ఈ సందర్భంగా కేసుల వేగవంతమైన విచారణకు ప్రాధాన్యత ఇవ్వాలని,చార్జ్ షీట్లు సమయానికి దాఖలు చేయాలని,సాక్షుల సమన్లు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఏఎస్పీ ఆదేశించారు. కోర్టు విచారణల్లో ఆలస్యం జరగకుండా నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు.అదేవిధంగా దర్యాప్తు ప్రక్రియలో టెక్నికల్ ఎవిడెన్స్ సేకరణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని, సైంటిఫిక్ మరియు డిజిటల్ ఆధారాలను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని సూచించారు. కేసుల నాణ్యతను మెరుగుపరచడం ద్వారా కన్విక్షన్ రేటును పెంచాలని దిశానిర్దేశం చేశారు.భాధితులకు త్వరితగతిన న్యాయం అందించేందుకు పోలీస్ మరియు ప్రాసిక్యూషన్ విభాగాల మధ్య సమన్వయం మరింత బలోపేతం చేయాలని తెలిపారు.ఈ సమావేశంలో పాల్గొన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీమతి విజయలక్ష్మి గారు కూడా దర్యాప్తు అధికారులకు కేసుల నిర్వహణ, సాక్ష్యాల సమర్పణ మరియు కోర్టు విచారణలో పాటించాల్సిన ముఖ్య అంశాలపై విలువైన సూచనలు చేశారు.మొత్తం మీద, ఈ సమావేశం ద్వారా కేసుల దర్యాప్తు మరియు న్యాయపరమైన ప్రక్రియలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు స్పష్టమైన మార్గదర్శకాలు పొందారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :