Saturday, 18 April 2026 10:46:38 PM
# గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్.

భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది.

Date : 18 April 2026 08:29 PM Views : 18

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్,హేమచంద్రపురం నందు శనివారం Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది.ఈ సమీక్షా సమావేశంలో జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల నుండి స్టేషన్ హౌస్ ఆఫీసర్లు, సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు,కోర్టు డ్యూటీ ఆఫీసర్లు,కోర్టు లైజన్ ఆఫీసర్లు మరియు ప్రాసిక్యూషన్ ఆఫీసర్లు పాల్గొన్నారు.ఈ సమావేశంలో గడిచిన ఫిబ్రవరి మరియు మార్చి నెలల్లో కోర్టుల్లో విచారణకు వచ్చిన కేసులపై సమగ్రంగా సమీక్ష నిర్వహించబడింది. ముఖ్యంగా కన్విక్షన్,అక్విటల్ (Acquittal) కేసుల పురోగతిని విశ్లేషిస్తూ,కేసుల దర్యాప్తులో ఉన్న లోపాలు,సవాళ్లు మరియు మెరుగుదలకు అవసరమైన అంశాలపై చర్చ జరిగింది.ఈ సందర్భంగా కేసుల వేగవంతమైన విచారణకు ప్రాధాన్యత ఇవ్వాలని,చార్జ్ షీట్లు సమయానికి దాఖలు చేయాలని,సాక్షుల సమన్లు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఏఎస్పీ ఆదేశించారు. కోర్టు విచారణల్లో ఆలస్యం జరగకుండా నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు.అదేవిధంగా దర్యాప్తు ప్రక్రియలో టెక్నికల్ ఎవిడెన్స్ సేకరణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని, సైంటిఫిక్ మరియు డిజిటల్ ఆధారాలను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని సూచించారు. కేసుల నాణ్యతను మెరుగుపరచడం ద్వారా కన్విక్షన్ రేటును పెంచాలని దిశానిర్దేశం చేశారు.భాధితులకు త్వరితగతిన న్యాయం అందించేందుకు పోలీస్ మరియు ప్రాసిక్యూషన్ విభాగాల మధ్య సమన్వయం మరింత బలోపేతం చేయాలని తెలిపారు.ఈ సమావేశంలో పాల్గొన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీమతి విజయలక్ష్మి గారు కూడా దర్యాప్తు అధికారులకు కేసుల నిర్వహణ, సాక్ష్యాల సమర్పణ మరియు కోర్టు విచారణలో పాటించాల్సిన ముఖ్య అంశాలపై విలువైన సూచనలు చేశారు.మొత్తం మీద, ఈ సమావేశం ద్వారా కేసుల దర్యాప్తు మరియు న్యాయపరమైన ప్రక్రియలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు స్పష్టమైన మార్గదర్శకాలు పొందారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :