తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్,హేమచంద్రపురం నందు శనివారం Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది.ఈ సమీక్షా సమావేశంలో జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల నుండి స్టేషన్ హౌస్ ఆఫీసర్లు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు,కోర్టు డ్యూటీ ఆఫీసర్లు,కోర్టు లైజన్ ఆఫీసర్లు మరియు ప్రాసిక్యూషన్ ఆఫీసర్లు పాల్గొన్నారు.ఈ సమావేశంలో గడిచిన ఫిబ్రవరి మరియు మార్చి నెలల్లో కోర్టుల్లో విచారణకు వచ్చిన కేసులపై సమగ్రంగా సమీక్ష నిర్వహించబడింది. ముఖ్యంగా కన్విక్షన్,అక్విటల్ (Acquittal) కేసుల పురోగతిని విశ్లేషిస్తూ,కేసుల దర్యాప్తులో ఉన్న లోపాలు,సవాళ్లు మరియు మెరుగుదలకు అవసరమైన అంశాలపై చర్చ జరిగింది.ఈ సందర్భంగా కేసుల వేగవంతమైన విచారణకు ప్రాధాన్యత ఇవ్వాలని,చార్జ్ షీట్లు సమయానికి దాఖలు చేయాలని,సాక్షుల సమన్లు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఏఎస్పీ ఆదేశించారు. కోర్టు విచారణల్లో ఆలస్యం జరగకుండా నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు.అదేవిధంగా దర్యాప్తు ప్రక్రియలో టెక్నికల్ ఎవిడెన్స్ సేకరణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని, సైంటిఫిక్ మరియు డిజిటల్ ఆధారాలను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని సూచించారు. కేసుల నాణ్యతను మెరుగుపరచడం ద్వారా కన్విక్షన్ రేటును పెంచాలని దిశానిర్దేశం చేశారు.భాధితులకు త్వరితగతిన న్యాయం అందించేందుకు పోలీస్ మరియు ప్రాసిక్యూషన్ విభాగాల మధ్య సమన్వయం మరింత బలోపేతం చేయాలని తెలిపారు.ఈ సమావేశంలో పాల్గొన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీమతి విజయలక్ష్మి గారు కూడా దర్యాప్తు అధికారులకు కేసుల నిర్వహణ, సాక్ష్యాల సమర్పణ మరియు కోర్టు విచారణలో పాటించాల్సిన ముఖ్య అంశాలపై విలువైన సూచనలు చేశారు.మొత్తం మీద, ఈ సమావేశం ద్వారా కేసుల దర్యాప్తు మరియు న్యాయపరమైన ప్రక్రియలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు స్పష్టమైన మార్గదర్శకాలు పొందారు.
Admin
తెలుగు వెలుగు టీవీ