Monday, 03 August 2026 10:02:48 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది.

Date : 18 April 2026 08:29 PM Views : 165

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్,హేమచంద్రపురం నందు శనివారం Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది.ఈ సమీక్షా సమావేశంలో జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల నుండి స్టేషన్ హౌస్ ఆఫీసర్లు, సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు,కోర్టు డ్యూటీ ఆఫీసర్లు,కోర్టు లైజన్ ఆఫీసర్లు మరియు ప్రాసిక్యూషన్ ఆఫీసర్లు పాల్గొన్నారు.ఈ సమావేశంలో గడిచిన ఫిబ్రవరి మరియు మార్చి నెలల్లో కోర్టుల్లో విచారణకు వచ్చిన కేసులపై సమగ్రంగా సమీక్ష నిర్వహించబడింది. ముఖ్యంగా కన్విక్షన్,అక్విటల్ (Acquittal) కేసుల పురోగతిని విశ్లేషిస్తూ,కేసుల దర్యాప్తులో ఉన్న లోపాలు,సవాళ్లు మరియు మెరుగుదలకు అవసరమైన అంశాలపై చర్చ జరిగింది.ఈ సందర్భంగా కేసుల వేగవంతమైన విచారణకు ప్రాధాన్యత ఇవ్వాలని,చార్జ్ షీట్లు సమయానికి దాఖలు చేయాలని,సాక్షుల సమన్లు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఏఎస్పీ ఆదేశించారు. కోర్టు విచారణల్లో ఆలస్యం జరగకుండా నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు.అదేవిధంగా దర్యాప్తు ప్రక్రియలో టెక్నికల్ ఎవిడెన్స్ సేకరణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని, సైంటిఫిక్ మరియు డిజిటల్ ఆధారాలను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని సూచించారు. కేసుల నాణ్యతను మెరుగుపరచడం ద్వారా కన్విక్షన్ రేటును పెంచాలని దిశానిర్దేశం చేశారు.భాధితులకు త్వరితగతిన న్యాయం అందించేందుకు పోలీస్ మరియు ప్రాసిక్యూషన్ విభాగాల మధ్య సమన్వయం మరింత బలోపేతం చేయాలని తెలిపారు.ఈ సమావేశంలో పాల్గొన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీమతి విజయలక్ష్మి గారు కూడా దర్యాప్తు అధికారులకు కేసుల నిర్వహణ, సాక్ష్యాల సమర్పణ మరియు కోర్టు విచారణలో పాటించాల్సిన ముఖ్య అంశాలపై విలువైన సూచనలు చేశారు.మొత్తం మీద, ఈ సమావేశం ద్వారా కేసుల దర్యాప్తు మరియు న్యాయపరమైన ప్రక్రియలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు స్పష్టమైన మార్గదర్శకాలు పొందారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :