Monday, 03 August 2026 02:56:57 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్.

Date : 25 July 2026 08:52 PM Views : 97

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జెన్కో రూ.54 వేల కోట్ల మొండి బకాయిపై సమీక్ష సమావేశంలో నోరు మెదపని ఉప ముఖ్యమంత్రి.54 వేల కోట్ల మొండి బకాయిని కనీసం వాయిదాల పద్ధతిలోనైనా చెల్లించండి.అవంతిక, డిప్‌సైడ్, కోయగూడెం, జేకే-5 ఎక్స్‌టెన్షన్ బ్లాక్‌లను సింగరేణికే కేటాయించాలి.ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్.రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈ నెల 23, 24 తేదీల్లో సత్తుపల్లి, కొత్తగూడెం, మణుగూరు సింగరేణి ఏరియాల్లో పర్యటించడం స్వాగతించదగ్గ విషయమని, అయితే సింగరేణికి తెలంగాణ జెన్కో నుంచి రావాల్సిన రూ.54 వేల కోట్ల మొండి బకాయిల అంశాన్ని సమీక్ష సమావేశంలో ప్రస్తావించకపోవడం నిరాశ కలిగించిందని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఎఐటియుసి) అదనపు ప్రధాన కార్యదర్శి మిరియాల రంగయ్య అన్నారు.శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, కొత్తగూడెంలో జెన్కో, సింగరేణి అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో సింగరేణి ఆర్థిక పరిస్థితికి అత్యంత కీలకమైన బకాయిల అంశంపై చర్చ జరగాల్సి ఉండేదని పేర్కొన్నారు.జెన్కో బకాయిలను కనీసం విడతల వారీగా అయినా చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుని, సింగరేణి సంస్థ ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు.అదేవిధంగా సత్తుపల్లి అవంతిక ప్రాజెక్టు, మణుగూరు డిప్‌సైడ్ బ్లాక్, కోయగూడెం,ఇల్లందు జేకే-5 ఎక్స్‌టెన్షన్ వంటి బొగ్గు బ్లాక్‌లను సింగరేణికే కేటాయించేలా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు.దీంతో సంస్థకు భవిష్యత్తులో ఉత్పత్తి పెరిగి, వేలాది మంది కార్మికుల ఉపాధి భద్రపడుతుందని అన్నారు.రామ్ పురం మైన్ గ్యాసిఫికేషన్‌కు అత్యంత అనుకూలమైన గనిని తక్షణమే ప్రారంభించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఇది సింగరేణి భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్న ప్రతి కార్మికుడికి ఇన్వాలిడేషన్ చెయ్యాలని ఆయన డిమాండ్ చేశారు.ప్రస్తుతం హార్ట్ ఆపరేషన్లు చేయించుకున్న వారు, పక్షవాతం (పారాలిసిస్)తో పాటు వివిధ తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కార్మికులు పెద్ద సంఖ్యలో ఉన్నారని, వారి పరిస్థితిని మానవతా దృక్పథంతో పరిశీలించి ఇన్వాలిడేషన్ మంజూరు చేయడం ద్వారా కార్మిక కుటుంబాలను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం,సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు.గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన లాభాల వాటా ప్రకటన కోసం కార్మికులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారని, ఆ ప్రకటనను వెంటనే విడుదల చేసి కార్మికులకు లాభాల వాటాను చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :