Wednesday, 16 September 2026 05:25:32 AM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

అశ్వరావుపేట నియోజకవర్గ అభివృద్ధి పనులపై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.

Date : 20 August 2024 09:10 PM Views : 703

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / అశ్వారావుపేట : అశ్వారావుపేట మండలంలో పర్యటించిన మంత్రి పొంగులేటి, నారాయణ పురం,వినాయక పురం గ్రామాల్లో నూతనంగా నిర్మించిన పంచాయితీ కార్యాలయ భవనాలను ప్రారంభించిన మంత్రి. అనంతరం అశ్వారావుపేట పట్టణంలోని శ్రీ శ్రీ కల్యాణ మండపంలో అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. తెలంగాణా రాష్ట్రాన్ని గత పది సంవత్సరాలు పాలించిన పెద్దోళ్ళు అవాకులు చవాకులు పేలుతున్నారు.. కావాలని రైతులను రెచ్చగొట్టే ప్రక్రియలు చేస్తున్నారు.. ఏ ఒక్క రైతు అభద్రత భావనకు లోనవ్వొద్దు.. ఇప్పటికే వేల కోట్ల రైతు రుణమాఫీ చేశాము.అర్హులైన వారికి ఇంకా ఎన్ని వేల కోట్ల రుణమాఫీ అయిన ఈ ప్రభుత్వం చేయటానికి సిద్ధంగా ఉంది. ఇది పేదోడి ప్రభుత్వం. ఇందిరమ్మ రాజ్యం. ఇచ్చిన మాట ప్రకారం నెరవేర్చటమే లక్ష్యంగా పనిచేస్తుంది. రైతులను రెచ్చగొట్టే పనులు చేస్తే సహించేదే లేదు కనీసం ప్రతి పక్ష హోదాని కూడా దక్కించుకోలేని స్థితిలో ఆ పార్టీ ఉంది అంటూ సెటైర్లు వేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. అటవీశాఖ అధికారులను భూ సర్వే విషయంలో రైతులతో అతి ఉత్సాహం చెయ్యద్దంటు చెప్పిన మంత్రి పొంగులేటి.

అనంతరం ఇరిగేషన్ ఈ ఈ శ్రీనివాస్ పై పొంగులేటి ఫైర్.. పొంగులేటి అడిగిన ఏ ఒక్క విషయానికి సరైన జవాబు చెప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అశ్వారావుపేట నియోజకవర్గ పరిధిలో అన్ని గ్రామాల్లో ఇళ్ళ పై వెళ్ళిన హైటెన్షన్ వైర్లను ఎటువంటి ఎస్టిమోషన్స్ ప్రజల పై వేయకండ డిపార్ట్మెంట్ నుండే క్లియర్ చేయాల్సిందిగా విద్యుత్ శాఖ కు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో వైద్యశాఖ అధికారులు వైద్యులు ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండాలని, హాస్పటల్ ఆకస్మిక తనిఖీలు చేస్తామని అలసత్వం ప్రదర్శించిన వైద్యులు లేదా వైద్య సిబ్బంది పై కఠిన చర్యలుతీసుకుంటామని వైద్యశాఖ అధికారులను హెచ్చరించారు. విద్యాశాఖాధికారులతో మాట్లాడుతూ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అసంపూర్తిగా ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మరియు టీచర్ల సర్దుబాటు ప్రక్రియను పూర్తిచేయాలని మంత్రి ఆదేశించారు. గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే మహిళా శక్తి రుణాలు అర్హులైన మహిళా సంఘాలను గుర్తించి స్థానిక శాసనసభ్యుల అనుమతితో మంజూరు చేయాలనిమంత్రి ఆదేశించారు. పర్యటనలో మంత్రితో పాటు పాల్గొన్న ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి,ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్,ఎస్పీ రోహిత్ రాజ్,మువ్వా విజయ్ బాబు మరియు జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :