Wednesday, 16 September 2026 09:06:54 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

సమన్వయంతో తొలి విడత పంచాయతీ ఎన్నికలను విజయవంతం చేయాలి: కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

Date : 09 December 2025 08:29 PM Views : 274

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, జనరల్ అబ్జర్వర్ సర్వేశ్వర్ రెడ్డి, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, పోలీసు శాఖ అధికారులు, ఎన్నికల సిబ్బందితో టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు.కలెక్టర్ మాట్లాడుతూ గురువారం నిర్వహించనున్న తొలి విడత ఎన్నికల కోసం కేటాయించిన సిబ్బంది తమ విధులకు సంబంధిత కేంద్రాల్లో రేపు ఉదయం తప్పనిసరిగా రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. అన్ని పోలింగ్ కేంద్రాలకు అవసరమైన సామాగ్రిని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుండి సమయానుసారంగా తరలించాలని అన్నారు. పోలింగ్‌కు అవసరమైన బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ బాక్సులు, ఇతర సామగ్రి తగినన్ని ఉన్నాయో లేదో పరిశీలించాలని సూచించారు.పోలింగ్ రోజు ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఓటింగ్ జరగనుండటంతో, ప్రజల్లో అవగాహన కల్పించేలా పంచాయతీ వాహనాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని, ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పటిష్ట బందోబస్తుతో పాటు వీడియో పర్యవేక్షణ ఏర్పాటు చేయాలని, వీడియో కెమెరాలు బ్యాలెట్ బాక్సులను నిరంతరం పర్యవేక్షించేలా అమర్చాలని ఆదేశించారు. ఎన్నికల సిబ్బంది పూర్తిస్థాయిలో అవగాహనతో పనిచేయాలని, వారు కలిగే సందేహాల నివృత్తికి తగిన శిక్షణ ఇవ్వాలని అధికారులకు సూచించారు.పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులు తరలించేందుకు అవసరమైన రవాణా వాహనాలను ముందుగానే సిద్ధం చేసుకుని, నిర్దేశించిన రూట్లలోనే తరలించాలన్నారు. పోలింగ్ రోజు నివేదికలు సమర్పించేందుకు ప్రత్యేక ఆపరేటర్‌ను నియమించి, వారికి తగిన శిక్షణ ఇచ్చి సమయానికి అన్ని నివేదికలు సమర్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందున పోలింగ్ అనంతరం ర్యాలీలు, సంబరాలు, విజయోత్సవాలు నిర్వహించేందుకు అనుమతి ఉండదని కలెక్టర్ స్పష్టం చేశారు. ఎన్నికల సిబ్బందికి అవసరమైన భోజనం, రవాణా వంటి సదుపాయాలు ఖచ్చితంగా కల్పించాలని సంబంధిత శాఖలను ఆదేశించారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ, ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని తెలిపారు. ఎన్నికల సిబ్బంది, పోలీసు సిబ్బంది పరస్పర సమన్వయంతో విధులు నిర్వర్తించాలని సూచించారు. పెద్ద పంచాయతీలు అయిన భద్రాచలం, సారపాక ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలకు తగినంత సిబ్బందిని ఏర్పాటు చేయాలని తెలిపారు. పోలింగ్ ముగిసిన అనంతరం కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :