Sunday, 01 March 2026 06:06:57 PM
# పీఎం విశ్వకర్మ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి - జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ మధుసూదన్ రెడ్డి. # జిల్లా కేంద్ర గ్రంథాలయం నందు చదివి సింగరేణి కాలరీస్ లో assistant engineer Singareni calories గా ఉద్యోగం సంపాదించిన బానోత్ నరేష్ # శ్రీరామనవమి ఉత్సవాలకు ముందస్తుగా పక్కా ప్రణాళికతో ఏర్పాట్లు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. # శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలి. పదవీ విరమణ పొందిన ఎస్బి ఎస్సై సూర్యనారాయణను ఘనంగా సత్కరించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # సంత్ సేవాలాల్ జయంతి వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే రాందాస్ నాయక్ . # తెలంగాణ రాష్ట్ర పద్మశాలి ఉద్యోగుల సంఘం క్యాలెండర్–2026 ఆవిష్కరణ. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన కలెక్టర్‌గా అంకిత్ ఐఏఎస్ పదవీ బాధ్యతలు స్వీకరణ. # రూ.2 కోట్ల గంజాయి పట్టివేత. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన కలెక్టర్ గా అంకిత్. # జిల్లా కలెక్టర్ బదిలీ. # తొలి రోజు ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహణ – అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్. # జాతీయ పంచాయతీ అవార్డుల పోటీలో సీతంపేట గ్రామం ఎంపిక – జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్. # ప్రతి కేసులో సమగ్ర దర్యాప్తును చేపట్టి నేరస్తులకు శిక్ష పడే విధంగా అధికారులందరూ కృషి చేయాలి. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్. # కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్ ని ఘనంగా సన్మానించిన సిపిఐ యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బరిగెల భూపేష్. # డివిజన్ ప్రజల ఆదరాభిమానాలకు రుణపడి ఉంటాం.16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ # మేయర్‌ను కలిసిన ప్రకృతి ప్రేమికులు. # సీఎం కప్ విజయాలు జిల్లాకు గర్వకారణం – జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్. # 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ. # పరీక్షా కేంద్రాల్లో మౌలిక వసతులు పూర్తిగా కల్పించాలి – రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణ రావు. # 28న జరుగు ఐ.ఎల్.పీ.ఏ రాష్ట్ర మహిళా సదస్సును జయప్రదం చెయండి. బార్ అసోసియేషన్ అధ్యక్షులు లక్కీనేని సత్యనారాయణ.

మీసేవ సర్టిఫికెట్ వెరిఫికేషన్ మొబైల్ యాప్‌పై జిల్లాస్థాయి శిక్షణ.

Date : 21 February 2026 07:12 PM Views : 214

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలో మీసేవ సేవలను మరింత సమర్థవంతంగా అమలు చేసి, ప్రజలకు సమయపాలనతో సేవలు అందించడమే లక్ష్యంగా ఐడీఓసి కార్యాలయం సమావేశ మందిరంలో శనివారం జిల్లాలోని నయాబ్ తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, జీపీవోలకు మీసేవ సర్టిఫికెట్ వెరిఫికేషన్ మొబైల్ యాప్ వినియోగంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించబడింది. జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని జిల్లా ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ సైదేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ మాట్లాడుతూ, మీసేవ కేంద్రాల్లో స్వీకరించే దరఖాస్తులను వేగవంతంగా మరియు పారదర్శకంగా పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మీసేవ ఫీల్డ్ వెరిఫికేషన్ మొబైల్ యాప్ వినియోగం అత్యంత కీలకమని తెలిపారు. యాప్ ద్వారా క్షేత్రస్థాయిలోనే ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేసి తక్షణమే పోర్టల్‌కు అప్‌డేట్ చేయవచ్చని వివరించారు.క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా అధికారులు దరఖాస్తుదారుల నివాసానికి వెళ్లి సంబంధిత వివరాలను యాప్‌లో నమోదు చేయడం, జియో-ట్యాగ్‌తో కూడిన లైవ్ ఫోటోలను అప్‌లోడ్ చేయడం వల్ల నకిలీ దరఖాస్తులకు అవకాశం లేకుండా పారదర్శకత పెరుగుతుందని తెలిపారు. భౌతిక ఫైళ్ల కదలిక అవసరం లేకుండా పూర్తిగా డిజిటల్ విధానంలోనే పరిశీలన పూర్తయ్యే విధంగా వ్యవస్థ ఉండటంతో, ముఖ్యంగా కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాల దరఖాస్తులు త్వరితగతిన ఆమోదం పొందే అవకాశం ఉంటుందని తెలిపారు . యాప్ ద్వారా సేకరించిన సమాచారం నేరుగా మీసేవ పోర్టల్‌కు అనుసంధానమై డేటా తక్షణమే అప్‌డేట్ అవుతుందని తెలిపారు.ఈ శిక్షణ తరగతులకు జిల్లాలోని సుమారు 160 మంది జీపీవోలు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, 40 మంది నయాబ్ తహసీల్దార్లు మరియు 15 మంది ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు. యాప్ డౌన్‌లోడ్ విధానం, లాగిన్ ప్రక్రియ, ఫీల్డ్ వెరిఫికేషన్ నమోదు, ఫోటో అప్‌లోడ్, రిపోర్ట్ సమర్పణ తదితర అంశాలపై ప్రదర్శనతో కూడిన సమగ్ర అవగాహన కల్పించారు. అధికారుల సందేహాలకు వివరణాత్మక సమాధానాలు అందించి, యాప్ వినియోగాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని సూచించారు.జిల్లాలో మీసేవ సేవలను మరింత పారదర్శకంగా మరియు సమర్థవంతంగా అమలు చేసి, ప్రజలకు నాణ్యమైన సేవలను వేగవంతంగా అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ సిబ్బంది, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :