తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మార్చి లో జరిగిన ఇంటర్మీడియట్ ఫలితాలను ఈనెల 22వ తేదీన విడుదల చేయడం జరుగుతుంది అని ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది, ప్రథమ సంవత్సరం ద్వితీయ సంవత్సరం ఫలితాలు ఒకేసారి ప్రకటించనునట్లు ఇంటర్ బోర్డు తెలియచేసింది. ఏప్రిల్ 22 వ తేదీన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఫలితాలను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. విద్యార్థులు ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్ సైట్ tsbie.cgg.gov.in మరియు results.cgg.gov.in lo చూసుకోవచ్చు అని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 5 నుండి 25 వరకు జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షలు 1,532 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించారు, 4.88 లక్షల మంది ఫస్టియర్ విద్యార్థులు ఉండగా,5 లక్షల మంది సెకండియర్ విద్యార్థులు ఉన్నారు.అనుకున్న సమయానికే ఫలితాలను విడుదల చేసేలా పకడ్బందీగా చర్యలు చేపట్టారు.నెల రోజుల్లో సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేయనున్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ