Saturday, 19 September 2026 02:51:49 PM
# హమారా ప్రసాద్ ను UAPA చట్టం కింద శాశ్వతంగా జైల్లోనే ఉంచాలి. మద్దెల శివకుమార్. # ఎస్‌ఆర్‌ ప్రైమ్‌ స్కూల్‌లో షీ టీమ్‌–భరోసా అవగాహన కార్యక్రమం. # వెదురు పెంపకాన్ని ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు.

నేషనల్ లెవెల్ ఓపెన్ యోగ ఛాంపియన్ షిప్ లో జాతీయ స్థాయిలో ప్రధమ బహుమతి సాధించిన సోడె నరేందర్ నాథ్ భగవత్:

Date : 24 October 2024 07:20 PM Views : 566

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం అక్టోబర్ 24(తెలుగువెలుగు)జూరురుపాడ్ మండల కేంద్రం సాయి ఎక్స్ లెంట్ విద్యార్ధి అయినా సోడె నరేందర్ నాథ్ భగవత్ 4వ తరగతి చదువుతున్న విద్యార్ధి ఆగష్టు 23, 24, 25 తేదీలలో జరిగిన జాతీయ స్థాయి యోగా పోటీల్లో ప్రథమ బహుమతి సాధించడం జరిగింది. బహుమతి ప్రధానోత్సవం అక్టోబర్ 21 న కొత్తగూడెం లోని శారదా విద్యాకుటీర్ నందు ఆర్గనైజర్ గుమలాపురం సత్య నారాయణ చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా సాయి ఎక్స్ లెంట్ అకాడమిక్ డైరెక్టర్ అయినా గోలి వీరభద్రం మరియు సుజాత మరియు ఉపాధ్యాయుల బృందం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గోలి వీర భద్రం మాట్లాడుతూ విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆరోగ్య పరంగా మరియు శరీర ధృడత్వం ఉండాలి అంటే యోగ ఎంతో అవసరమని ప్రస్తుత రోజుల్లో విద్యార్థుల యొక్క జీవితం యంత్రికంగా కొనసాగుతుందని, పూర్వకాలంలో లాగా ఆటలు లేవని దానివల్ల చిన్నతనంలోనే ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఈ ఆరోగ్య సమస్యలను అధికమించాలంటే తప్పనిసరిగా విద్యార్థులు యోగా చేస్తూ ప్రతియొక్క విద్యార్ధి తన ఆరోగ్యాన్ని పెంపొందించు కోవాలన్నారు అదే విధంగా నరేందర్ కు మరియు తల్లిదండ్రులైన శ్రీరామ్, అరుణ లకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.అకాడమిక్ డైరెక్టర్ సుజాత మాట్లాడుతూ సాయి ఎక్స్ లెంట్ స్కూల్ నందు యోగా క్లాసులు నిర్వహించడంతో పాటు ప్రతి విద్యార్ధి చదువుతో పాటు వారి ఆరోగ్యం పై దృష్టి పెట్టి చదువులో నవోదయ, గురుకులాలకు కోచింగ్ ఇస్తూ పేద విద్యార్థులకు నిత్య అండదండలు ఉంటున్నాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో అధ్యాపక బృందమైన శివ కుమారి, అనిత, నబీన, జమున, సాహితి, దుర్గా భవాని, భాను నవ్య, హరిత తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :