తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం డిసెంబర్ 25 తెలుగు వెలుగు) జూలూరుపాడు మండలంలోని క్రిస్మస్ పండుగ సందర్భంగా పడమటి నరసాపురం గ్రామంలో ఇమ్మానియేల్, బెతెల్ చర్చిలను సందర్శించిన ముఖ్య అతిథులు జిల్లా నాయకులు లేళ్ల వెంకటరెడ్డి మాట్లాడుతూ మానవత్వాన్ని చాటే ఏసుక్రీస్తు బోధనలు ప్రపంచాన్ని ఎంతగానో ప్రభావితం చేసినవి క్షమాగుణం, శాంతి, కరుణ, సహనం, ప్రేమతో జీవించిన క్రీస్తు జీవన గమనం, నేటికీ అందరికీ ఆచరణీయము. ఈ క్రిస్మస్ పండుగతో ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతి, సంతోషం, ఐశ్వర్యం సిద్ధించాలని మనస్ఫూర్తిగా ఆ ప్రభువును కోరుకుంటున్నాను అని అన్నారు
తదుపరి ప్రార్ధనా మందిరంలో అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇమ్మానియేల్ సెర్చ్ పాస్టర్ కబీర్దాస్, బెతెల్ సెర్చ్ పాస్టర్ నాని, మాజీ ఎంపీటీసీ దుద్దుకూరి మధుసూదన్ రావు, మండల కాంగ్రెస్ నాయకులు లేళ్ల గోపాల్ రెడ్డి, బాదావత్ హరీష్, బూరం రమేష్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ