తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మే 01 (తెలుగు వెలుగు) : చికాగో అమరవీరుల స్ఫూర్తితో కార్మిక ఉద్యమాలు చేపట్టాలి కొత్తగూడెం రీజియన్ కార్యదర్శి యర్రగాని కృష్ణయ్య సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్-AITUC ఆధ్వర్యంలో గురువారం నాడు కొత్తగూడెం కార్పొరేట్ లో బంగ్లోస్ వద్ద మేడే జెండా ఆవిష్కరణ నిర్వహించారు. అనంతరం వివిధ డిపార్ట్మెంట్స్ లో జరిగిన మేడే కార్యక్రమంలో కాంట్రాక్ట్ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.ఈ సందర్భంగా కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ కొత్తగూడెం రీజియన్ కార్యదర్శి యర్రగాని కృష్ణయ్య ఉపాధ్యక్షులు,KW కిష్టాఫర్ లు పాల్గొని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా మే 20 వ తేదీన జరిగే సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను,హక్కులను హరించే లేబర్ కోడులకు వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. మేడే అమరవీరుల స్ఫూర్తితో భవిష్యత్తులో కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల సాధన కోసం పోరాటాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎఐటియుసి నాయకులు ఎం.చంద్రశేఖర్, నరసింహ, రాజు, కృష్ణమూర్తి, కళ్యాణ్, చుక్కయ్య, సుజాత, సుశీల, రాజేశ్వరి, రాజేష్, రాములు, మహేందర్, భాస్కర్, పండు ,ప్రభాకర్ ,హుస్సేన్, వినోద, అనసూర్య, వాసవి, విజయలక్ష్మి, విజయ్ కృష్ణ, రాము, గుర్రం శ్రీను,సూర్య, మంగిలాల్, తరుణ్,సందీప్ కుమార్, సిద్ధూ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ