తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం,జూలూరుపాడు ఆగస్టు 17(తెలుగు వెలుగు) బెంగాల్ రాష్ట్రం కలకత్తా నగరంలో మెడికల్ విద్యార్థినిపై అత్యాచార ఘటనను నిరసిస్తు జెపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్ నుండి కొమరం భీమ్ సెంటర్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జూలురుపాడు మెడికల్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు హాజరై ,ఈ సందర్బంగా మాట్లాడుతూ మెడికో విద్యార్థిని అత్యాచార ఘటన దురదృష్టకరం అన్నారు. అత్యాచార ఘటనకు పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.. ఈ కార్యక్రమంలో జెపిఆర్ ఫౌండేషన్ లో స్థాపకులు ఇడుపుల రాజు , లలిత , ఏఎన్ఎంలు ఆశ వర్కర్లు ,ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు దెబ్బెందల సాయి , భారతీయ గోర్ బంజారా పోరాట సమితి ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షులు దుర్గాప్రసాద్, సేవాలాల్ సేన సంఘం జూలూరుపాడు మండల అధ్యక్షుడు బానోత్ లక్ష్మణ్ నాయక్,కల్లోజి దినేష్ , పోతురాజు శ్రీను, ఇష్రం నవీన్, పోతురాజు రవి, బర్ల వంశీ మందపాటి సాగర్ ఎల్లబోయిన నరేష్ బడుగుమౌళి నేతకాని గతం బన్ను , కిరణ్ తదితరులు పాల్గొన్నారు...
Admin
తెలుగు వెలుగు టీవీ