Wednesday, 16 September 2026 05:10:10 PM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం దరఖాస్తులకు గడువు ఈ నెల 12 వరకు పొడిగింపు... సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్

Date : 09 July 2025 03:56 PM Views : 812

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సింగరేణి జులై 9( తెలుగు వెలుగు).సింగరేణి భవన్, జులై 9, 2025 . రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు సింగరేణి సంస్థ కార్పోరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా ప్రారంభించిన రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం దరఖాస్తుల స్వీకరణ గడువును ఈనెల 12వ తేదీ వరకు పొడిగించినట్లు సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ బుధవారం ఒక ప్రకటన లో తెలిపారు. ఈ పథకం ద్వారా తెలంగాణ రాష్ట్రం నుండి సివిల్స్ ప్రిలిమ్స్ లో పాసై మెయిన్స్ కు హాజరవుతున్న అభ్యర్థులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల ఆర్థిక ప్రోత్సాహకాన్ని అందిస్తున్నట్లు వెల్లడించారు. దరఖాస్తుల స్వీకరణ కు గతంలో ఇచ్చిన గడువు తేదీ ఈనెల 7వ తేదీతో ముగిసిపోయింది. అయితే అభ్యర్థుల నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు ఈ నెల 12వ తేదీ వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. సివిల్స్ ప్రిలిమ్స్ లో పాసైన తెలంగాణ ప్రాంత అభ్యర్థులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని 12వ తేదీలోగా దరఖాస్తులు అన్లైన్ లో సమర్పించాలని కోరారు. అలాగే సివిల్స్ ప్రిలిమ్స్ పాసైన సింగరేణి ఉద్యోగుల పిల్లలకూ రూ.లక్ష చొప్పున ప్రోత్సాహకం అందించనున్నట్లు తెలిపారు. ఇదీ నేపథ్యం...గతేడాది రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం పథకాన్ని ప్రారంభించారు. గతేడాది 140 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా వీరికి ఒక్కొక్కరికి సింగరేణి సంస్థ లక్ష రూపాయల చొప్పున ప్రోత్సాహక నగదును అందజేసింది. వీరిలో 20 మంది మెయిన్స్ లోనూ పాసై ఇంటర్వ్యూకి ఎంపిక కాగా వారికి కూడా ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున ప్రోత్సాహకాన్ని అందించింది. ఇదే విధంగా ఈ ఏడాది కూడా తెలంగాణ ప్రాంత అభ్యర్థులకు ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించింది.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :