తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రభుత్వ స్థలాల ఆక్రమణలను అడ్డుకుంటే దాడులకు తెగబడటం దుర్మార్గం.ప్రభుత్వ స్థలాలను ప్రజలకే ఉపయోగపడాలి.సర్వేను జీర్ణించుకోలేకే కక్షపూరితంగా నామా వినోద్పై దాడి. భూకబ్జాదారుల దాడిని ప్రజలందరూ ముక్తకంఠంతో ఖండించాలి. కొత్తగూడెం కార్పొరేషన్ సిపిఐ పక్ష మహిళా ప్రతినిధి పద్మ. నామా వినోద్పై దాడి చేసినవారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించేందుకు చేసిన ప్రయత్నాన్ని అడ్డుకోవడంతోనే కక్షకట్టి ఈ దాడికి పాల్పడ్డారని కొత్తగూడెం కార్పొరేషన్ సిపిఐ పక్ష మహిళా ప్రతినిధి పద్మ డిమాండ్ చేశారు. శనివారం స్థానిక శేషగిరిభవన్లో ఆమె మాట్లాడారు. పాల్వంచ సీతారాంపట్నం 35వ డివిజన్ పరిధిలోని ప్రభుత్వ స్థలాన్ని ప్రజల ఉపయోగార్థం ప్రీ-ప్రైమరీ హెల్త్ సెంటర్, అంగన్వాడీ సెంటర్, కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం కేటాయించాలని ప్రజల తరఫున తాము అధికారులను కోరామని ఆమె తెలిపారు. ప్రజా అవసరాల నిమిత్తం స్థానిక తహసీల్దార్ ఈ భూమిని అధికారికంగా సర్వే కూడా చేశారని ఆమె గుర్తుచేశారు. అయితే ఈ విషయాన్ని జీర్ణించుకోలేక, ఎలాగైనా భూమిని కబ్జా చేయాలనే దురుద్దేశంతోనే 35వ డివిజన్ కార్పొరేటర్ భర్త నామా వినోద్పై కొందరు భూకబ్జాదారులు అత్యంత అమానుషంగా దాడి చేశారని ఆమె మండిపడ్డారు. సమాజంలో ఇలాంటి అరాచక శక్తుల ఆగడాలను ప్రజలందరూ ముక్తకంఠంతో ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పిలుపునిచ్చారు. ఈ దాడి ఘటనపై పోలీస్ ఉన్నతాధికారులు అత్యంత కఠినంగా వ్యవహరించి, నిందితులను వెంటనే అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. సమావేశంలో నామా కీర్తి, పగడాల ఆకాంక్ష, నూనావత్ శ్యామల, మద్దాల హరిత, యూసుఫ్, బండి నర్సింహా, బోయిన విజయ్, పొలమూరు ధనలక్ష్మి, గుర్రం వెంకటేశ్వర్ రావు, సింధు తపస్వి తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ