Saturday, 19 September 2026 05:55:34 PM
# హమారా ప్రసాద్ ను UAPA చట్టం కింద శాశ్వతంగా జైల్లోనే ఉంచాలి. మద్దెల శివకుమార్. # ఎస్‌ఆర్‌ ప్రైమ్‌ స్కూల్‌లో షీ టీమ్‌–భరోసా అవగాహన కార్యక్రమం. # వెదురు పెంపకాన్ని ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు.

నామా వినోద్‌పై దాడి చేసిన భూకబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి.

Date : 06 June 2026 07:37 PM Views : 176

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రభుత్వ స్థలాల ఆక్రమణలను అడ్డుకుంటే దాడులకు తెగబడటం దుర్మార్గం.ప్రభుత్వ స్థలాలను ప్రజలకే ఉపయోగపడాలి.సర్వేను జీర్ణించుకోలేకే కక్షపూరితంగా నామా వినోద్‌పై దాడి. భూకబ్జాదారుల దాడిని ప్రజలందరూ ముక్తకంఠంతో ఖండించాలి. కొత్తగూడెం కార్పొరేషన్ సిపిఐ పక్ష మహిళా ప్రతినిధి పద్మ. నామా వినోద్‌పై దాడి చేసినవారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించేందుకు చేసిన ప్రయత్నాన్ని అడ్డుకోవడంతోనే కక్షకట్టి ఈ దాడికి పాల్పడ్డారని కొత్తగూడెం కార్పొరేషన్ సిపిఐ పక్ష మహిళా ప్రతినిధి పద్మ డిమాండ్ చేశారు. శనివారం స్థానిక శేషగిరిభవన్లో ఆమె మాట్లాడారు. పాల్వంచ సీతారాంపట్నం 35వ డివిజన్ పరిధిలోని ప్రభుత్వ స్థలాన్ని ప్రజల ఉపయోగార్థం ప్రీ-ప్రైమరీ హెల్త్ సెంటర్, అంగన్వాడీ సెంటర్, కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం కేటాయించాలని ప్రజల తరఫున తాము అధికారులను కోరామని ఆమె తెలిపారు. ప్రజా అవసరాల నిమిత్తం స్థానిక తహసీల్దార్ ఈ భూమిని అధికారికంగా సర్వే కూడా చేశారని ఆమె గుర్తుచేశారు. అయితే ఈ విషయాన్ని జీర్ణించుకోలేక, ఎలాగైనా భూమిని కబ్జా చేయాలనే దురుద్దేశంతోనే 35వ డివిజన్ కార్పొరేటర్ భర్త నామా వినోద్‌పై కొందరు భూకబ్జాదారులు అత్యంత అమానుషంగా దాడి చేశారని ఆమె మండిపడ్డారు. సమాజంలో ఇలాంటి అరాచక శక్తుల ఆగడాలను ప్రజలందరూ ముక్తకంఠంతో ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పిలుపునిచ్చారు. ఈ దాడి ఘటనపై పోలీస్ ఉన్నతాధికారులు అత్యంత కఠినంగా వ్యవహరించి, నిందితులను వెంటనే అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. సమావేశంలో నామా కీర్తి, పగడాల ఆకాంక్ష, నూనావత్ శ్యామల, మద్దాల హరిత, యూసుఫ్, బండి నర్సింహా, బోయిన విజయ్, పొలమూరు ధనలక్ష్మి, గుర్రం వెంకటేశ్వర్ రావు, సింధు తపస్వి తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :