Thursday, 17 September 2026 09:46:30 AM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

- వారోత్సవాల పేరిట పిల్లల సృజనాత్మక శక్తికి వెలికితీయడం అభినందనీయం : ఎంఎల్ఎ కూనంనేని

Date : 20 November 2024 06:37 PM Views : 667

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గ్రంధాలయాలు విజ్ఞాన బాండాగారలని, ప్రత్యక్ష దేవాలయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎంఎల్ ఏ కూనంనేని సాంబశివరావు అన్నారు. గ్రంధాలయ వారోత్సవల ముంగింపు సందర్భంగా కొత్తగూడెం అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్యాతిధిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం కూనంనేని మాట్లాడుతూ 57వ జాతీయగ్రంధాలయ వారోత్సవాలను జిల్లా కేంద్ర గ్రంధాలయంలో ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ వారోత్సవాలను పురస్కరించుకుని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్ధినీ విద్యార్ధులకు పలు రకాల పోటీలు నిర్వహించారని, ఆ పోటీల్లో పిల్లలు సంతోషంతో పాల్గొన్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. పిల్లలో దాగుతున్న సృజనాత్మక శక్తియుక్తులను వెలికి తీసేందుకు ఇలాంటి వేధికలు ఎంతగానో ఉపయుక్తంగా ఉంటాయని, విద్యార్థులను వెన్నుతట్టి ప్రోత్సహిస్తే ఆకాశమే హద్దుగా వారు ఉత్సాహంతో అనేక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ముందుకు వస్తారని చెప్పారు. ఆటపాటలతో హాయిగా సాగిపోయే బాల్య మస్తిష్కంలో ఎన్నో ఆలోచలు దాగుంటాయని, వాటిని మెరుగుపరుచుకునేందుకు వేధికలు దొరికితే అంతకు మించిన ఆనందం ఉండదన్నారు. పిల్లలు కూడా నిత్యం వుస్తక పఠనంతో పాటు పత్రికలను చదవడం అలవర్చుకోవాలని, దేశంలో, రాష్ట్రంలో, మన చుట్టు ప్రక్కల ఏమి జరుగుతుందో తెలుసుకోవడం వల్ల మరింత ఆలోచనా శక్తి పెరుగుతుందని చెప్పారు. ఖాళీ సమయాల్లో విద్యార్థులు గ్రంధాలయాలకు వచ్చి మంచిమంచి పుస్తకాలు చదువుకుని తెలివితేటలు పెంచుకోవాలని చెప్పారు. విద్యార్థులకు క్రమశిక్షణ ఎంతో అవసరమని, బాల్యంలో చక్కగా చదువుకుని పైకి రావాలని, మనిషి జీవన శైలిని మార్చగల శక్తి కేవలం ఒక్క చదువుకు మాత్రమే ఉందన్నారు. కష్టపడి చదువుకున్న వాళ్లు నేడు ఎంతో సంతోష కరమైన జీవితాలను గడువుతున్నారని, వారి బ్రతుకులు బంగారు మయంగా ఉన్నాయన్నారు. ఇక్కడికి వచ్చిన చిన్నారులను చూస్తుంటే ముచ్చటేస్తోందని, నా బాల్య జీవితం ఒక్క సారిగా కళ్లముందు కదలాడిందన్నారు. నూతనంగా నిర్మించుకున్న గ్రంధాలయాన్ని త్వరలో సరి కొత్త హంగులతో ప్రారంభించుకుని పాఠకులకు అందుబాటులోనికి తీసుకొస్తామని, ఇంకా ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకొస్తే వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని అన్నారు. ఈ గ్రంధాలయంపై ఆధారపడి చదివిన ఎందరో అభ్యర్థులు ఉద్యోగాలు సాధించినట్లు తెలిసిందని అనునిత్యం అభ్యర్ధులకు అందుబాటులో ఉంటూ వారు చదువుకుని ఉద్యోగాలు సాధించేందుకు సిబ్బంది కృషి చేయడం అభినందనీయం అన్నారు. అనంతరం వారం రోజుల పాటు నిర్వహించిన పలు సాంస్కృతి, వైజ్ఞానికి కార్యక్రమాల్లో ప్రతిభను కనబరిచిన చిన్నారులకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కావు సీతామహాలక్ష్మీ, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా, గ్రంథాలయ కార్యదర్శి వి అర్జున్, లైన్స్ క్లబ్ అధ్యక్షులు ఎస్కే దస్తగిరి, వివేకవర్ధిని ప్రిన్సిపాల్ మహేష్, హెచ్ఎం నీరజ, గ్రంథాలయ ఆఫీస్ ఇంచార్జ్ ఎం నవీన్, గ్రంథ పాలకులు మణి మృదుల, మధుబాబు,రుక్మిణి గీత, రిటైర్డ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :