Sunday, 02 August 2026 04:55:11 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు కొత్తగూడెం లో సోమవారం పర్యటన

Date : 11 July 2026 02:46 PM Views : 334

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సింగరేణి సంస్థకు తాటిచెర్ల బొగ్గు గనులను కేటాయించిన నేపథ్యంలో, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి , భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు మరియు తెలంగాణలో ఉన్న ఎనిమిది మంది శాసనసభ్యులు సోమవారం కొత్తగూడెం పర్యటనకు రానున్నట్లు భారతీయ జనతా పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,సింగరేణి సంస్థ అభివృద్ధికి, కార్మికుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా నిలుస్తోందని అన్నారు. సింగరేణిలో పనిచేస్తున్న సుమారు 40 వేల మంది కార్మికులకు కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషిస్తూ, సంస్థ అభివృద్ధికి అవసరమైన సహాయ సహకారాలను అందిస్తోందని పేర్కొన్నారు. గతంలో బిజెపి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం కూడా సింగరేణి సంస్థకు అవసరమైన పూర్తి సహాయ సహకారాలను అందించిందని గుర్తు చేశారు. అదే విధంగా ప్రస్తుతం కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం సింగరేణి అభివృద్ధి, కార్మికుల సంక్షేమం కోసం సంపూర్ణ సహకారం అందిస్తోందని తెలిపారు. ఈ నేపథ్యంలో సోమవారం జరుగనున్న కొత్తగూడెం పర్యటనను విజయవంతం చేయాలని, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ముఖ్యంగా సింగరేణి కార్మికులు మరియు వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జాటోత్ వెంకన్న నాయక్, రాష్ట్ర గిరిజన మోర్చా కార్యదర్శి భూక్య రవి నాయక్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు సముద్రాల గాయత్రి, మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఎస్.కె రెహమతుల్లా, జిల్లా మీడియా కన్వీనర్ రామారావు,ఆత్మ నిర్భర్ భారత్ జిల్లా కన్వీనర్ గొడుగు శ్రీధర్ యాదవ్,లక్ష్మీదేవిపల్లి,చుంచుపల్లి మండల అధ్యక్షులు నవీన్,బలగం శ్రీధర్,మరియు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :