Sunday, 02 August 2026 01:12:40 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

పాల్వంచ పట్టణాన్ని అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చేస్తాం : కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు

Date : 15 July 2026 05:08 PM Views : 85

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందస్తు ప్రణాళికతో ముందడుగు. మౌలిక వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం. రాజీ లేకుండా నాణ్యతా ప్రమాణాలతో పనులు పూర్తి చేయాలి. నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి నిరంతరం శ్రమిస్తా. రూ.1.73 కోట్లతో 10 రకాల అభివృద్ధి పనులకు శ్రీకారం. కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. పాల్వంచ పట్టణాన్ని అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చేస్తామని కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ పట్టణంలో బుధవారం రూ.1.73 కోట్లతో చేపట్టనున్న రోడ్లు, డ్రైన్లు, ఇతర అభివృద్ధి పనులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శంకుస్థాపనల సభల్లో ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందడుగు వేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. కార్పొరేషన్ పరిధిలోని 31, 33, 34, 36, 38, 42, 45 డివిజన్లలో ఈ నిధులతో మొత్తం 10 అభివృద్ధి, నిర్మాణ పనులను ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్నట్లు వివరించారు. ప్రజలకు అత్యంత అవసరమైన మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని, అందులో భాగంగానే ఈ నిధులను మంజూరు చేయించడం జరిగిందని పేర్కొన్నారు. పట్టణంలో మురుగునీటి పారుదల వ్యవస్థను మెరుగుపరిచేందుకు డ్రైన్ల నిర్మాణంతో పాటు, రవాణా సౌకర్యాల మెరుగుదలకు సిమెంట్ రోడ్లను నిర్మిస్తామన్నారు. ఎలాంటి రాజీ లేకుండా నాణ్యతా ప్రమాణాలతో, నిర్దేశిత గడువులోగా ఈ పనులన్నింటినీ త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ప్రజాపక్షం నిలిచే ఎమ్మెల్యేగా నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి నిరంతరం శ్రమిస్తానని, పాల్వంచ పట్టణ రూపురేఖలను మార్చడమే లక్ష్యంగా నిరంతరం పనిచేస్తానని ఆయన ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమాల్లో సీపీఐ జిల్లా కార్యదర్శి SK సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్, డిప్యూటీ మేయర్ లలిత కుమారి, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అడుసుమిల్లి సాయిబాబా, వీసంశెట్టి పూర్ణచంద్రరావు, ఉప్పుశెట్టి రాహుల్, కార్పొరేషన్ కమిషనర్ కె సుజాత, తహసిల్దార్ దారా ప్రసాద్, ఎలక్ట్రికల్ ఏ డి ఈ అబ్దుల్ రెహమాన్, డిప్యూటీ కమిషనర్ విజయానంద్, టౌన్ ఎస్సై తోట నాగరాజు, కార్పొరేటర్లు వీసంశెట్టి విశ్వేశ్వరరావు, గుర్రం వెంకటేశ్వర్లు, నామ కీర్తి, నూనావత్ శ్యామల, గొర్లె అన్నపూర్ణ, సింధు తపస్వి, సుగుణ, నరేష్, మధుచంద్, విజయలక్ష్మి, సీపీఐ నాయకులు శనగారపు శ్రీనివాసరావు, గౌతమి కృష్ణ, శేఖర్ బాబు, ys గిరి, నాగమణి, SA రెహమాన్, ఆలపాటి ప్రసాద్, కరీం, కాకటి రవీందర్, దినేష్, నరేష్, నవీన్, అంజాద్, రామాచారి, బట్టు హరి, చరప శ్రీను, లక్ష్మీ, రాజేశ్వరరావు, జిలానీ, భీమనాయక్, ఆదినారాయణ, అశోక్, వివిధ శాఖల డిఇలు, ఏఈలు అధికారులు తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :