తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రెండో రోజు ముమ్మరంగా రోడ్డు, డ్రైన్ నిర్మాణం పనులు.నిర్మాణం పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన మేయర్ గణేష్. నాణ్యతతో పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం.కొత్తగూడెం కార్పొరేషన్ అభివృద్ధిపై ప్రేత్యేక ద్రుష్టి సారించాం.కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. డీఎంఎఫ్టీ నిధులతో చేపట్టిన రోడ్డు, డ్రైన్ నిర్మాణ పనులు పాల్వంచ పట్టణంలో ముమ్మరంగా కొనసాగుతున్నాయని, నాణ్యతా ప్రమాణాలతో వీటిని పూర్తి చేయడమే లక్ష్యమని కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్ అన్నారు. కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు కృషితో మంజూరైన రూ.38 లక్షల డీఎంఎఫ్టీ నిధులతో తహసిల్దార్ కార్యాలయం నుండి మున్సిపల్ కార్యాలయం వరకు జరుగుతున్న రోడ్డు, డ్రైన్ నిర్మాణ పనులను సోమవారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగూడెం నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఎనలేని కృషి చేస్తున్నారని కొనియాడారు. పట్టణ ప్రగతిపై ఆయనకు ఉన్న ప్రత్యేక ఆసక్తి, నిధుల సాధనలో చూపిస్తున్న చొరవ వల్లనే నేడు అనేక అభివృద్ధి పనులు సాకారమవుతున్నాయని పేర్కొన్నారు. ప్రజా సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి నిరంతరం శ్రమిస్తున్న ప్రజాప్రతినిధుల సహకారంతో పట్టణ రూపురేఖలు శరవేగంగా మారుతున్నాయని వివరించారు. ఈ పనులను గడువులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్లను, అధికారులను ఆదేశించారు. ప్రజాధనం సద్వినియోగం అయ్యేలా నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని స్పష్టం చేశారు. భవిష్యత్తులో మరిన్ని నిధులు తీసుకువచ్చి కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని కొత్తగూడెం, పాల్వంచ, సుజాతనగర్ పట్టణాలను అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతామని మేయర్ ధీమా వ్యక్తం చేశారు. మేయర్ వెంట సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం, కల్లూరి వెంకటేశ్వర్లు, జిల్లా కార్యవర్గ సభ్యులు అడుసుమిల్లి సాయిబాబా, ఉప్పుశెట్టి రాహుల్, కార్పొరేటర్ గుర్రం వెంకటేశ్వర్లు, ఆలపాటి ప్రసాద్, కాకటి రవీందర్, మున్సిపల్ అధికారులు తదితరులు వున్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ