Thursday, 17 September 2026 09:37:16 AM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

సింగభూపాలెం చెరువుకు త్వరలో గోదావరి జలాలు.కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

Date : 28 August 2026 05:54 PM Views : 123

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సింగభూపాలెం చెరువుకు త్వరలో గోదావరి జలాలు. సీతారామ ప్రాజెక్టు నీళ్లతో జిల్లా రైతాంగానికి సాగునీరు.ప్రతిపాదిత కాల్వల నిర్మాణానికి ఆమోదం లభించింది.చెరువుకట్ట పటిష్టతకు రూ.5 కోట్లు మంజూరు.టెండర్ల ప్రక్రియ పూర్తి.. త్వరలో పనులు ప్రారంభం.జిల్లా రైతాంగ క'న్నీటి' కస్టాలు తీర్చే భాధ్యతను స్వీకరించా.కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.సింగభూపాలెం చెరువుకు అతిత్వరలోనే సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను రానున్నాయని, అందుకు సంబందించిన ప్రతిపాదనలు సిద్దమయ్యాయని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. సుజాతనగర్ మండల పరిధిలోని సింగభూపాలెం చెరువును శుక్రవారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్టు జలాలు స్థానిక రైతాంగానికి అందకుండా గతంలో అన్యాయం జరిగిందన్నారు. కొత్తగూడెంతో పాటు భద్రాచలం, అశ్వారావుపేట, ఇల్లందు, పినపాక నియోజకవర్గాల సాగు అవసరాలకు ఈ నీటిని మళ్లించేలా సమగ్ర ప్రణాళిక రూపొందించాలని ప్రభుత్వంతో పలుమార్లు చర్చలు జరిపి గట్టిగా ఒత్తిడి తీసుకువచ్చామని తెలిపారు. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని వెల్లడించారు. జూలూరుపాడు మండలం వినోభానగర్ మీదుగా మండలంలోని చెరువులన్నింటినీ నింపుతూ, అక్కడి నుంచి పెద్దవాగు ద్వారా సుజాతనగర్ మండలంలోని సింగభూపాలెం చెరువుకు గోదావరి జలాలు చేరేలా ప్రతిపాదనలు సిద్ధం చేశామని, వీటికి త్వరలోనే పూర్తిస్థాయి అనుమతులు మంజూరు చేయిస్తామని చెప్పారు. ఇది సుజాతనగర్, పరిసర గ్రామాల రైతులకు ఎంతో ఊరట కలిగిస్తుందన్నారు. అలాగే కుంగుబాటుకు గురైన సింగభూపాలెం చెరువుకట్ట పునర్నిర్మాణానికి, రక్షణ చర్యలకు రూ.5 కోట్లు మంజూరయ్యాయని, ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయిందని, త్వరలోనే పనులు వేగవంతం చేసి రైతులకు అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. కొత్తగూడెం నియోజకవర్గంతోపాటు జిల్లాలోని రైతాంగం సాగునీటికోసం పడుతున్న కష్టాలను గుర్తించి, జిల్లా రైతాంగానికి ఉపయోగపడకుండా నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్టు నిర్మాణ ప్రతిపాదనలను నిశితంగా పరిశీలించి ప్రభుత్వంతో కోట్లాడి సాగునీటిని సాదించుకోబోతున్నామని కూనంనేని స్పష్టం చేశారు. కూనంనేని వెంట సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్, అధికారులు సుజాత, కె మహేశ్వరరావు, కె చంద్రశేఖర్, శ్రావణి, స్థానిక నాయకులు సలిగంటి శ్రీనివాస్, భూక్యా దస్రు, జక్కుల రాములు, తాళ్ల వెంకటేశ్వరరావు, ధర్మయ్య, పొదిలీ శ్రీనివాస్, మహేశ్వరరావు, గోపి తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :