Sunday, 02 August 2026 02:33:04 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

మణుగూరులో జిల్లా కలెక్టర్ అంకిత్ సుడిగాలి పర్యటన – ప్రభుత్వ సంస్థల్లో ఆకస్మిక తనిఖీలు..

Date : 05 March 2026 05:42 PM Views : 284

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట – నాణ్యమైన భోజనం అందించడం అందరి బాధ్యత విధి నిర్వహణలో నిర్లక్ష్యం సహించము : జిల్లా కలెక్టర్ అంకిత్. జిల్లా కలెక్టర్ అంకిత్ గురువారం మణుగూరు మండలంలో సుడిగాలి పర్యటన నిర్వహించి పలు ప్రభుత్వ సంస్థల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో భాగంగా మణుగూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఆశ్రమ గిరిజన ఉన్నత పాఠశాల, గుండు సింగారం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం, ప్రభుత్వ గిరిజన మోడల్ ప్రాథమిక పాఠశాలను సందర్శించి అక్కడి పరిస్థితులను సమగ్రంగా పరిశీలించారు. మణుగూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్ ఆసుపత్రిలోని వార్డులు, ఔషధ నిల్వ గది, మందుల సరఫరా విధానం, ఔట్‌పేషంట్ విభాగం, సిబ్బంది హాజరు వివరాలను పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చిన రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలపై వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగుల పట్ల సేవాభావంతో వైద్య సేవలు అందించాలని సూచించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆసుపత్రిలో 24 గంటలు వైద్యులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఆసుపత్రి ఆవరణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ మణుగూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు ఆశ్రమ గిరిజన ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని తరగతి గదులు, కంప్యూటర్ ల్యాబ్, కిచెన్ షెడ్, స్టోర్ రూమ్‌లను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారికి అందుతున్న సౌకర్యాలు, బోధన విధానం గురించి తెలుసుకున్నారు. కిచెన్ షెడ్‌లో ఆహార తయారీ విధానాన్ని పరిశీలించి మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా అనే విషయాన్ని ఆరా తీశారు. స్టోర్ రూమ్‌లో నిల్వ ఉంచిన బియ్యం, పప్పులు మరియు ఇతర ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడిన కలెక్టర్ వారు పరీక్షలకు ఎలా సిద్ధమవుతున్నారో అడిగి తెలుసుకున్నారు. గత సంవత్సరం ఫలితాల వివరాలు తెలుసుకొని ఈ ఏడాది 100 శాతం ఉత్తీర్ణత సాధించేలా విద్యార్థులు కృషి చేయాలని సూచించారు. విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంలో నాణ్యతతో పాటు పరిశుభ్రత తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని, వారికి నాణ్యమైన ఆహారం అందించడం మన అందరి బాధ్యత అని పేర్కొన్నారు. విద్యార్థులకు అందించే ఆహారం విషయంలో ఎటువంటి లోటుపాట్లు తలెత్తినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గిరి యూనిట్ ద్వారా సరఫరా అవుతున్న చిక్కీలను స్వయంగా రుచి చూసి వాటి నాణ్యతను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే విద్యార్థులకు సిద్ధం చేసిన మధ్యాహ్న భోజనాన్ని కూడా రుచి చూసి ఆహార నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఆశ్రమ గిరిజన ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహిస్తున్న ప్రాథమిక పాఠశాలను కూడా కలెక్టర్ తనిఖీ చేశారు. అక్కడి తరగతి గదులు, విద్యార్థుల హాజరు, బోధన విధానం మరియు అందిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. చిన్నారులతో మాట్లాడి వారికి పాఠాలు ఎలా బోధిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ప్రాథమిక స్థాయి నుంచే మంచి విద్య అందేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.

గుండు సింగారం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం మరియు ప్రభుత్వ గిరిజన మోడల్ ప్రాథమిక పాఠశాలను కూడా కలెక్టర్ పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు అందిస్తున్న సౌకర్యాలు, పోషకాహారం పంపిణీ విధానం, పిల్లల హాజరు వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేంద్రంలోని వంటగది, స్టోర్ రూమ్, త్రాగునీటి సదుపాయం, పరిశుభ్రత పరిస్థితులను సమగ్రంగా పరిశీలించారు. స్టోర్ రూమ్‌లో నిల్వ ఉంచిన బియ్యం, పప్పులు, గుడ్లు మరియు ఇతర ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేసి గుడ్ల పరిమాణాన్ని పరిశీలించారు. పిల్లలకు అందించే పోషకాహారం మెనూ ప్రకారం సమయానికి అందుతున్నదా అనే విషయాన్ని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అలాగే కేంద్రంలో చిన్నారులకు అందిస్తున్న ప్రీ-స్కూల్ విద్యా కార్యక్రమాలు, ఆటపాటల ద్వారా బోధన విధానాన్ని కూడా పరిశీలించారు. పిల్లలకు పోషకాహారం నాణ్యంగా, పరిశుభ్రంగా అందేలా, కేంద్రం పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి స్వర్ణలత లేనినా, ప్రధానోపాధ్యాయురాలు మహాలక్ష్మి, వైద్యులు, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి, ఉపాధ్యాయులు విద్యార్థులు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :