తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూలూరుపాడు హై స్కూల్ నందు ఏర్పాటుచేసిన పీఆర్టీయూ జూలూరుపాడు మండల నూతన కార్యవర్గ ఎన్నిక కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ప్రధాన కార్యదర్శి B. రవి హాజరవడం జరిగింది. ఎన్నికల అధికారిగా రాష్ట్ర కార్యదర్శి కుసుమ శ్రీనివాసరావు వ్యవహరించారు. ఈ సందర్భంగా PRTU జూలూరుపాడు మండల అధ్యక్షులుగా సిహెచ్ ప్రభాకర్ రావు, ప్రధాన కార్యదర్శిగా బి ఉపేందర్ రావ్, అసోసియేట్ అధ్యక్షులుగా దేవేందర్, పుల్లారావు , ఉపాధ్యక్షులుగా లక్ష్మణ్ శ్యామ్ సుందర్, మహిళా ఉపాధ్యక్షురాలిగా ఉమా , కార్యదర్శిగా మధు ని , కోశాధికారి గా అంజి నిఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన PRTU జిల్లా ప్రధాన కార్యదర్శి B. రవి మాట్లాడుతూ పిఆర్టియు సంఘం ఏర్పడిన నాటినుండి ఈనాటి వరకు కూడా ఉపాధ్యాయుల సమస్యల కోసం పనిచేస్తూ అహర్నిశలు కృషి చేస్తుందని, ఈ క్రమంలో ఉపాధ్యాయులకు అనేక రకాల ప్రయోజనాలు సంఘం ద్వారా సాధించబడినాయని,పిఆర్టియు సంఘం సమస్యలను పరిష్కరించడంలో ఎల్లప్పుడూ ముందుంటుందని,మున్ముందు కాంట్రాక్టు ఉపాధ్యాయుల సమస్యలు, ఉపాధ్యాయులకు రావలసిన పెండింగ్ బిల్లుల చెల్లింపులు,5DA ల మంజూరు, 317 go సమస్యలు, 398 సమస్య, జీపీఎఫ్ పార్ట్ఫినల్ ,cps రద్దు సమస్యలు గురించి చర్చించి ప్రభుత్వం ని కోరడంనైనది .
Admin
తెలుగు వెలుగు టీవీ