తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తెలంగాణలో సుస్థిరమైన ప్రజా పాలన అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలపై కుట్ర చేస్తున్నారని జిల్లా కాంగ్రెస్ నాయకులు దొండపాటి శ్రీనివాసరావు (వాసు) అన్నారు. బిజెపిలో అభద్రతాభావం పెరిగిందన్నడానికి నిదర్శనమే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పై జరుగుతున్న ఈడి దాడులు, దేశంలో బిజెపి పై వ్యతిరేకం వ్యక్తం అవుతున్న వేళ కాంగ్రెస్ నేతలను భయాందోళనకు గురి చేసేందుకే ఐటి, ఈడి , దాడులను బిజెపి నేతలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రజా క్షేత్రంలో పొంగులేటిని ఎదుర్కొనలేకనే బిజెపి బలమైన నాయకుల మీద దాడులు చేయిస్తున్నారు, కాంగ్రెస్ నాయకులను భయపెట్టే కుట్ర మానసిక సైర్యాన్ని దెబ్బ కొట్టే ప్రయత్నం బిజెపి చేస్తుందని ఇటువంటి దాడులకు భయపడే ప్రసక్తే లేదని అన్నారు, దీనికి కమలం పార్టీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు, మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి పై ఎన్నిసార్లు దాడులు చేసినా ఆయనను గాని ,ఆయన అనుచర గణాన్ని ,ఆయన వెనకున్న ప్రజా సైన్యాన్ని భయపెట్టలేరని ఆయన అన్నారు, ఈ కార్యక్రమంలో జూలూరుపాడు మండల కాంగ్రెస్ నాయకులు మిరియాల కిరణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ