తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం (అర్బన్) ప్రజా ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలో ఉన్నటువంటి ప్రతి ,పేద మధ్యతరగతి మహిళల అకౌంట్లోకి 2500 రూపాయలు వేస్తామన్న హామీని అమలు పరుస్తారని మహిళలు ఎంతగానో ఎదురుచూస్తున్నారని పదో వార్డ్ కౌన్సిలర్ మునిగడప పద్మ ప్రభుత్వాన్ని అన్నారు. గురువారం పదో వార్డులోని అంబేద్కర్ చమన్ లో జరిగిన భగత్ సింగ్, మదర్ తెరిసా మెప్మా సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ఆరు గ్యారెంటీలో అమలు చేస్తున్నటువంటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం , 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత కరెంటు వల్ల మిగిలే మొత్తాన్ని మనమందరం పొదుపు చేసుకొని పొదుపు సంఘాల ద్వారా వారి ఒక మహిళగా మన కుటుంబ అభివృద్ధి కోసం మనమే పాటుపడాలని ఆమె సూచించారు. పిల్లల పై చదువులకు మెప్మా సంఘాల ద్వారా వడ్డీ లేని రుణాలు అందించాలని ఆమె ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అలాగే గత ఐదు సంవత్సరాల నుండి వితంతువులైన మహిళలకు, 58 సంవత్సరాలు దాటిన వృద్ధులకు ,వికలాంగులకు కొత్త పెన్షన్లు మంజూరు కాక అర్హులైన లబ్ధిదారులు ప్రభుత్వం ఎప్పుడు అందిస్తుందో అని ఎదురుచూస్తున్నారని అన్నారు. ప్రజల యొక్క కోరికల కనుగుణంగా ప్రభుత్వం తక్షణమే పెన్షన్లు మంజూరు చేసి వారిని ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మెప్మా సమావేశంలో మెప్మా సీ వో శాంత కుమార్, చంద్రశేఖర్, మదర్ తెరిసా ఆర్పి ఎం కవిత, క్లస్టర్ ఆర్పి షబానా, బానోతు సునీత, ఆసిఫా అన్ని గ్రూపుల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ