Sunday, 02 August 2026 01:12:27 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం.

Date : 25 July 2026 08:35 PM Views : 100

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం.నలుగురు నిందితుల అరెస్ట్ – కారు, ఐదు మొబైల్ ఫోన్లు స్వాధీనం.భద్రాచలం పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం (25-07-2026) మధ్యాహ్నం 2.30 గంటలకు పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీలలో భారీగా డ్రై గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. భద్రాచలం పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) ఆధ్వర్యంలో పోలీసులు వీరభద్రం ఫంక్షన్ హాల్ సమీపంలో, కూనవరం రోడ్డుపై నిర్వహించిన తనిఖీలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మోతుగూడెం ప్రాంతం నుంచి కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరుకు అక్రమంగా తరలిస్తున్న 101 కిలోల డ్రై గంజాయిని పట్టుకున్నారు.ఈ సందర్భంగా కర్ణాటక రిజిస్ట్రేషన్ నంబర్ KA-03-NR-5892 గల మారుతి ఎర్టిగా కారును, ఐదు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని, గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న నలుగురు నిందితులను అరెస్టు చేశారు.అరెస్టైన నిందితులు:1. సలీం పాషా (53), బొమ్మనహళ్లి, బెంగళూరు దక్షిణ, కర్ణాటక.2. ఈ. రాజేంద్ర ప్రసాద్ (34), నల్లమడ, అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్.3. ఎం.డి. అర్బాజ్ హుస్సేన్ (22), బొమ్మనహళ్లి, బెంగళూరు దక్షిణ, కర్ణాటక.4. ఎస్. గుల్జార్ (35), జయనగర, నెలమంగల, బెంగళూరు గ్రామీణ జిల్లా, కర్ణాటక.ప్రాథమిక విచారణలో నిందితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మోతుగూడెం నుంచి గంజాయిని భద్రాచలం–ఖమ్మం మార్గం గుండా బెంగళూరుకు రోడ్డు మార్గంలో తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ దాడిలో సీఐ రహీమున్నీసా, ఎస్‌ఐ సీతారామరాజు, హెడ్ కానిస్టేబుల్ కరీమ్, పోలీసు సిబ్బంది భద్రం, సీతారాం, రాకేష్, రవి పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :