Thursday, 17 September 2026 08:15:56 AM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

జిల్లా కలెక్టర్ అంకిత్ ఐఏఎస్ కి డీసీహెచ్‌ఎస్ డా. జి. రవి బాబు, నర్సింగ్ సూపరింటెండెంట్ల కృతజ్ఞతలు.

Date : 17 July 2026 07:06 PM Views : 334

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రోగుల సేవలకు మరింత బలం.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టీవీవీపీ ఆసుపత్రులకు 69 మంది స్టాఫ్ నర్సుల కేటాయింపు.జిల్లా కలెక్టర్ అంకిత్ ఐఏఎస్ కి డీసీహెచ్‌ఎస్ డా. జి. రవి బాబు, నర్సింగ్ సూపరింటెండెంట్ల కృతజ్ఞతలు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని తెలంగాణ వైద్య విధాన పరిషత్ (TVVP) పరిధిలోని అన్ని ఆసుపత్రులు గత కొన్ని సంవత్సరాలుగా స్టాఫ్ నర్సుల తీవ్ర కొరతను ఎదుర్కొంటున్నాయి. నర్సుల కొరత కారణంగా క్షేత్ర స్థాయిలో నెలకొన్న సమస్యలను జిల్లా కలెక్టర్ అంకిత్ ఐఏఎస్ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సహకారంతో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగింది.మారుమూల, ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనను సానుకూలంగా పరిశీలించి, ఇటీవలే ఇచ్చిన రెగ్యులర్ నర్సుల రిక్రూట్మెంట్ లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టీవీవీపీ ఆసుపత్రులకు మొత్తం 69 మంది స్టాఫ్ నర్సులను కేటాయించింది. ఈ నిర్ణయం జిల్లాలో ప్రభుత్వ వైద్య రంగానికి ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలవడంతో పాటు, ఆసుపత్రుల్లో నర్సింగ్ సేవలను గణనీయంగా బలోపేతం చేయనుంది.ఈ అదనపు నర్సింగ్ సిబ్బందితో అత్యవసర, ఇన్‌పేషెంట్, ప్రసూతి, శస్త్రచికిత్స, ఐసీయూ తదితర సేవలు మరింత సమర్థవంతంగా అందుబాటులోకి రానుండగా, ముఖ్యంగా వర్షాకాలంలో పెరుగుతున్న రోగుల అవసరాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఆసుపత్రుల పరిపాలనకు ఇది ఎంతో ఉపశమనాన్ని కలిగించనుంది.ఈ సందర్భంగా జిల్లాలోని ఏడు టీవీవీపీ ఆసుపత్రుల నర్సింగ్ సూపరింటెండెంట్లు డీసీహెచ్‌ఎస్ డా. జి. రవి బాబు తో కలిసి జిల్లా కలెక్టర్ అంకిత్ ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సత్కరించారు.నర్సింగ్ సిబ్బంది కొరత పరిష్కారానికి చూపిన ప్రత్యేక చొరవ, నిరంతర సహకారం, అలాగే సకాలంలో తీసుకున్న చర్యలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.అలాగే, ఈ ప్రతిపాదనకు సానుకూల స్పందన తెలిపి జిల్లాకు 69 మంది స్టాఫ్ నర్సులను కేటాయించిన రాష్ట్ర గౌరవ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కి, రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి డా. క్రిస్టినా జెడ్. చోంగ్తుకి, వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.నర్సింగ్ సిబ్బంది బలోపేతం కావడం ద్వారా జిల్లాలో ప్రభుత్వ వైద్య సేవల నాణ్యత మరింత మెరుగుపడి, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంత ప్రజలకు నాణ్యమైన, సత్వర మరియు సమర్థవంతమైన వైద్య సేవలు మరింత చేరువ అవుతాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో జిల్లా కలెక్టర్ అందిస్తున్న నాయకత్వం, సహకారం అభినందనీయమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో డీసీహెచ్‌ఎస్ డా. జి. రవి బాబు, జిల్లా వైద్య & ఆరోగ్య శాఖ ప్రతినిధి డా. వీరబాబు, నర్సింగ్ సూపరింటెండెంట్లు ఫ్లోరెన్స్ పద్మ, భారతి, రేవతి, జయ, ఝాన్సీ, ఆశా వర్ధిని, శారద, సీత, రాధాకుమారి పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :