Sunday, 02 August 2026 04:55:18 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

జిల్లా కలెక్టర్ అంకిత్ ఐఏఎస్ కి డీసీహెచ్‌ఎస్ డా. జి. రవి బాబు, నర్సింగ్ సూపరింటెండెంట్ల కృతజ్ఞతలు.

Date : 17 July 2026 07:06 PM Views : 247

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రోగుల సేవలకు మరింత బలం.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టీవీవీపీ ఆసుపత్రులకు 69 మంది స్టాఫ్ నర్సుల కేటాయింపు.జిల్లా కలెక్టర్ అంకిత్ ఐఏఎస్ కి డీసీహెచ్‌ఎస్ డా. జి. రవి బాబు, నర్సింగ్ సూపరింటెండెంట్ల కృతజ్ఞతలు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని తెలంగాణ వైద్య విధాన పరిషత్ (TVVP) పరిధిలోని అన్ని ఆసుపత్రులు గత కొన్ని సంవత్సరాలుగా స్టాఫ్ నర్సుల తీవ్ర కొరతను ఎదుర్కొంటున్నాయి. నర్సుల కొరత కారణంగా క్షేత్ర స్థాయిలో నెలకొన్న సమస్యలను జిల్లా కలెక్టర్ అంకిత్ ఐఏఎస్ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సహకారంతో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగింది.మారుమూల, ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనను సానుకూలంగా పరిశీలించి, ఇటీవలే ఇచ్చిన రెగ్యులర్ నర్సుల రిక్రూట్మెంట్ లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టీవీవీపీ ఆసుపత్రులకు మొత్తం 69 మంది స్టాఫ్ నర్సులను కేటాయించింది. ఈ నిర్ణయం జిల్లాలో ప్రభుత్వ వైద్య రంగానికి ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలవడంతో పాటు, ఆసుపత్రుల్లో నర్సింగ్ సేవలను గణనీయంగా బలోపేతం చేయనుంది.ఈ అదనపు నర్సింగ్ సిబ్బందితో అత్యవసర, ఇన్‌పేషెంట్, ప్రసూతి, శస్త్రచికిత్స, ఐసీయూ తదితర సేవలు మరింత సమర్థవంతంగా అందుబాటులోకి రానుండగా, ముఖ్యంగా వర్షాకాలంలో పెరుగుతున్న రోగుల అవసరాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఆసుపత్రుల పరిపాలనకు ఇది ఎంతో ఉపశమనాన్ని కలిగించనుంది.ఈ సందర్భంగా జిల్లాలోని ఏడు టీవీవీపీ ఆసుపత్రుల నర్సింగ్ సూపరింటెండెంట్లు డీసీహెచ్‌ఎస్ డా. జి. రవి బాబు తో కలిసి జిల్లా కలెక్టర్ అంకిత్ ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సత్కరించారు.నర్సింగ్ సిబ్బంది కొరత పరిష్కారానికి చూపిన ప్రత్యేక చొరవ, నిరంతర సహకారం, అలాగే సకాలంలో తీసుకున్న చర్యలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.అలాగే, ఈ ప్రతిపాదనకు సానుకూల స్పందన తెలిపి జిల్లాకు 69 మంది స్టాఫ్ నర్సులను కేటాయించిన రాష్ట్ర గౌరవ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కి, రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి డా. క్రిస్టినా జెడ్. చోంగ్తుకి, వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.నర్సింగ్ సిబ్బంది బలోపేతం కావడం ద్వారా జిల్లాలో ప్రభుత్వ వైద్య సేవల నాణ్యత మరింత మెరుగుపడి, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంత ప్రజలకు నాణ్యమైన, సత్వర మరియు సమర్థవంతమైన వైద్య సేవలు మరింత చేరువ అవుతాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో జిల్లా కలెక్టర్ అందిస్తున్న నాయకత్వం, సహకారం అభినందనీయమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో డీసీహెచ్‌ఎస్ డా. జి. రవి బాబు, జిల్లా వైద్య & ఆరోగ్య శాఖ ప్రతినిధి డా. వీరబాబు, నర్సింగ్ సూపరింటెండెంట్లు ఫ్లోరెన్స్ పద్మ, భారతి, రేవతి, జయ, ఝాన్సీ, ఆశా వర్ధిని, శారద, సీత, రాధాకుమారి పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :