తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : బాల్యవివాహాలు నిర్వహించిన మరియు సహకరించిన వారిపై కఠిన చర్యలు తప్పవని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రోహిత్ రాజు సూచించారు. బాల్య వివాహ వ్యతిరేక దినోత్సవం గా ఐక్యరాజ్యసమితి ప్రతిపాదించిన నవంబర్ 27వ తారీకు ను పురస్కరించుకొని యాక్షన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ సంస్థ సభ్యులు ఎస్పీ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఎవరైనా బాల్యవివాహాలు చేసిన సహకరించిన వారిపై బాల్య వివాహ నిరోధక చట్టం మరియు పోక్సో యాక్ట్ కూడా విధించబడుతుందని తెలిపారు. బాల్యవివాహాలు జిల్లాలో ఎక్కడైనా జరుగుతున్నట్టు సమాచారం తెలిసినట్లయితే వెంటనే 1098 లేదా డయల్ 100 లేదా జస్ట్ రైట్స్ వారికి తెలియజేయాలని కోరారు, ఈ కార్యక్రమానికి ఎయిడ్ సేవా సంస్థ జిల్లా కోఆర్డినేటర్ వి రాజేష్ సభ్యులు మోహన్ మాన్సింగ్ రవిచంద్ర నాగేంద్రబాబు మౌనిక పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ