Wednesday, 16 September 2026 05:23:59 AM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

ఏఐటీయూసీ పోరాటాల ఫలితమే చారిత్రాత్మక ఒప్పందాలు.కొత్తగూడెం ఏరియా బ్రాంచ్ కార్యదర్శి జక్కుల గట్టయ్య.

Date : 03 September 2026 06:05 PM Views : 104

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి ఏఐటీయూసీ చేపట్టిన పోరాటాల ఫలితంగానే 24 డిమాండ్లపై యాజమాన్యంతో చారిత్రాత్మక ఒప్పందాలు జరిగాయని ఏఐటీయూసీ కొత్తగూడెం ఏరియా బ్రాంచ్ కార్యదర్శి జక్కుల గట్టయ్య తెలిపారు. జూన్‌ 8న 31 డిమాండ్లతో సమ్మె నోటీస్‌ ఇవ్వడంతో యాజమాన్యం దిగివచ్చి ఆర్‌ఎల్‌సీ సమక్షంలో ఒప్పందాలు చేసుకుందని పేర్కొన్నారు.కొత్తగూడెం ఏరియా వర్క్‌షాప్‌, ఆర్‌సీహెచ్‌పీ వద్ద గురువారం నిర్వహించిన గేట్‌ మీటింగ్‌ల్లో గట్టయ్యతో పాటు ఏఐటీయూసీ సెంట్రల్‌ ఆర్గనైజింగ్‌ కార్యదర్శి వీరస్వామి ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు.ఒప్పందాల్లో భాగంగా కార్మికుల పేరోల్‌పై ఆదాయ పన్నును యాజమాన్యమే చెల్లించడం, దసరాకు ముందే లాభాల వాటా చెల్లించడం, సహజ మరణం పొందిన కార్మికుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియాను రూ.20 లక్షలకు పెంచడం, 149 మంది డిపెండెంట్లకు ఈ నెలాఖరులోగా ఉద్యోగ నియామకాలు చేపట్టడం వంటి కీలక నిర్ణయాలు జరిగాయని తెలిపారు.అలాగే 2017 జేఎంఈటీలకు నోషనల్‌ ఓవర్‌మెన్‌ ప్రమోషన్లు, వివిధ కేటగిరీలకు ప్రమోషన్‌ క్యాడర్‌ స్కీమ్‌, ఖాళీ పోస్టులను అంతర్గత ఉద్యోగులతో భర్తీ చేయడం, ప్రతి నెలా మెడికల్‌ బోర్డు నిర్వహణ, హైదరాబాద్‌లో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు, మెడికల్‌ అన్‌ఫిట్‌ ఉద్యోగులకు సూటబుల్‌ జాబ్‌, బదిలీల కాలపరిమితి తగ్గింపు, మందమర్రి–క్యాసనపల్లి మున్సిపల్‌ పరిధిలో 9 శాతం హెచ్‌ఆర్‌ఏ వంటి పలు అంశాలపై అంగీకారం కుదిరిందన్నారు.ఈ ఒప్పందాలను పూర్తిస్థాయిలో అమలు చేసే వరకు ఏఐటీయూసీ పర్యవేక్షిస్తుందని గట్టయ్య స్పష్టం చేశారు.కార్యక్రమంలో ఏఐటీయూసీ వైస్‌ ప్రెసిడెంట్‌ కత్తెర్ల రాములు, నాయకులు హుమాయూన్‌, గుమ్మడి వీరయ్య, సందెబోయిన శ్రీనివాస్‌,ఏరియా వర్క్‌షాప్‌ పిట్‌ కార్యదర్శి మధుకృష్ణ ఆర్‌సీహెచ్‌పీ పిట్‌ కార్యదర్శి సురేందర్, పిట్‌ కమిటీ సభ్యులు,గుమ్మడి మురళి,కరుణాకర్, రాజకుమారస్వామి, గోపీనాథ్, సకినాల భాస్కర్,కస్తూరి రమేష్, సత్యనారాయణ,శేఖర్, అతహార్ పాషా, కిరణ్ కుమార్,కల్యాణ్,హరీష్, పి ఆర్ సి రెడ్డి,శ్రీహరి,తుమ్మల శ్రీనివాస్ ,నరేష్,ప్రభాకర్,పరశురాములు,అనూష,వెంకట దుర్గ,వసంతిక,రమణ,సంధ్యారాణి,శ్రీమన్నారాయణ,సత్యనారాయణ, ఈశ్వర్,మహేష్, , వెంకట్,మహేశ్వరరావు,సామ్యూల్ ,సుధాకర్,జాన్సన్,గౌస్,అజ్గర్,రాజలింగయ్య,సత్యనారాయణ,ఎనగందుల వెంకటేశ్వర్లు,సంపత్, అల్తాఫ్ ,మోహన్,చందూలాల్,మరియు ఆర్ సి హెచ్ పి నుండి పి. వసంత మూర్తి, వంశీ, ఆర్. మురళి, బి.మురళి, టి. రమేష్, యు. శివదర్శన్,బాల నాగేశ్వరరావు, డీ ఎల్ ఆర్ కార్మికులు,తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :