Saturday, 01 August 2026 11:50:19 PM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

దమ్మపేటలో ఆదివారం జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం. సమావేశానికి విచ్చేయనున్న రాష్ట్ర నాయకులు గడల శ్రీనివాసరావు.

Date : 30 July 2026 06:36 PM Views : 306

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్న నియోజకవర్గాల జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం లలో భాగంగా ఆగస్టు 2వ తేదీ ఆదివారం రోజు అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేటలో జనసేన పార్టీ నాయకుల కార్యకర్తల సమావేశాన్ని పార్టీ నాయకులు నిర్వహించనున్నారు. ఈ ఆత్మీయ సమావేశానికి జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు గడల శ్రీనివాసరావు రానున్నారు.కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. ఆగస్టు 2వ తేదీ ఆదివారం ఉదయం 10:30 గంటలకు నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి జనసైనికులు, వీర మహిళలు, పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు.ఈ సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు, మాజీ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు మాట్లాడుతూ, పార్టీ బలోపేతం, ప్రజా సమస్యల పరిష్కారం, కార్యకర్తల సమన్వయమే ఈ సమావేశం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యువజన విభాగం జనసేన పార్టీ నాయకులు గరికె రాంబాబు మాట్లాడుతూ, జిల్లా నలుమూలల నుంచి భారీ బైక్ ర్యాలీతో జనసైనికులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఐదు మండలాల జనసేన పార్టీ నాయకులు ఎస్.కె అబ్దుల్ రెహమాన్, బానోత్ వినోద్ కుమార్, తాటికొండ ప్రవీణ్, పసుపులేటి కిషోర్, తాటికొండ వేణు మాట్లాడుతూ, మండలంలోని ప్రతి గ్రామం నుంచి కార్యకర్తలు, యువత, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని జనసేన శక్తిని చాటాలని కోరారు. ఈ కార్యక్రమం పార్టీ బలోపేతానికి దోహదపడే విధంగా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :