తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం తెలుగు వెలుగు జూలై 5 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం లో ఉమ్మడి ఖమ్మం జిల్లా జనసేన పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఆత్మీయ సమావేశంలో భాగంగా ఖమ్మం జిల్లా జనసేన పార్టీ ఇంచార్జ్ మిరియాల రామకృష్ణ మాట్లాడుతూ మాజీ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు జనసేన పార్టీలో జాయిన్ కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. గడల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ నెల 12వ తారీఖున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంగా పార్టీ కార్యాలయం ప్రారంబించబోతున్నామని ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి జనసేన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి, తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ నెమూరి శంకర్ గౌడ్, జనసేన పార్టీ ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి తెలంగాణ జనసేన పార్టీ మీడియా ఇంచార్జ్ దుంపటి శ్రీను లు హాజరు కానున్నారని ఉమ్మడి ఖమ్మం జిల్లా జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు,కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరారు ఈ కార్యక్రమానికి వైరా జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ కట్ట రామకృష్ణ( R K), అశ్వరావుపేట నియోజకవర్గ ఇన్చార్జ్ డేగల రాము, సత్తుపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ బండి నరేష్, కొత్తగూడెం టౌన్ ప్రెసిడెంట్ సాదిక్ పాషా, సత్తుపల్లి టౌన్ ప్రెసిడెంట్ ఆళ్ల నరేష్, జూలూరుపాడు మండల ప్రెసిడెంట్ ఉసికల రమేష్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ గణపసాయి, ములకలపల్లి మండల ప్రెసిడెంట్ తాటికొండ ప్రవీణ్, మరియు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మండల ప్రెసిడెంట్లు, జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ