తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జైత్రామ్'కు మెరుగైన వైద్యం అందించాలి.బాధితుడిని పరామర్శించిన ఎమ్మెల్యే కూనంనేని.ఖమ్మంలో కార్పొరేషన్ కార్మిడిని పరామర్శించిన ఎమ్మెల్యే విద్యుత్ దీపాలు అమర్చుతూ ప్రమాదవశాత్తు కిందపడి తీవ్రంగా గాయపడిన మున్సిపల్ మల్టీ పర్పస్ కార్మికుడు భూక్యా జైత్రామ్ కు ప్రత్యేక శ్రద్ధతో మెరుగైన వైద్య సేవలు అందించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వైద్యులను ఆదేశించారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మంగపేట 23వ డివిజన్కు చెందిన మున్సిపల్ కార్మికుడు భూక్యా జైత్రామ్ విద్యుత్ స్తంభంపై దీపం ఏర్పాటు చేస్తుండగా జారి కిందపడి తీవ్ర గాయాలపాలయ్యారు. బాధితుడిని మొదట కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి, అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం ఖమ్మంలోని మమత జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గురువారం ఆస్పత్రికి వెళ్ళి చికిత్స పొందుతున్న జైత్రామ్ను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పరిస్థితి విషమంగా ఉన్నందున ప్రాణాపాయం తప్పించేలా నిపుణులైన వైద్యులతో మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ప్రమాదానికి గురైన కార్మికుడి కుటుంబానికి అండగా ఉంటామని, ఆయన త్వరగా కోలుకోవాలని కూనంనేని ఆకాంక్షించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ