తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తెలంగాణ రాష్ట్ర సాధనకు సిద్ధాంతపరమైన బలాన్ని అందించిన ఉద్యమ మేధావి, ప్రముఖ విద్యావేత్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆచార్య జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, తెలంగాణ కోసం జీవితాంతం అంకితభావంతో కృషి చేసిన మహనీయుడు ఆచార్య జయశంకర్ అని అన్నారు. ప్రజల హక్కులు, ఆత్మగౌరవం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయమని పేర్కొన్నారు. సమాజం పట్ల బాధ్యత, నిజాయితీ, క్రమశిక్షణ, ప్రజాసేవ పట్ల నిబద్ధత వంటి విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని సూచించారు.ఆచార్య జయశంకర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించే దిశగా జిల్లా పోలీసు శాఖ కట్టుబడి పనిచేస్తుందని ఎస్పీ తెలిపారు.ఈ కార్యక్రమంలో డిసిఆర్బి డిఎస్పి మల్లయ్య స్వామి, ఏఆర్ డిఎస్పి సత్యనారాయణ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మంజ్య, ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, ఇస్లావత్ శ్రీనివాస్, ఆర్ఐలు సుధాకర్, నరసింహారావు, కృష్ణారావు పోలీసు సిబ్బంది పాల్గొని ఆచార్య జయశంకర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ