Wednesday, 16 September 2026 07:38:17 AM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

రైల్వే వంతెనల మంజూరు కోసం కృషి చేస్తున్నా : కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

Date : 01 September 2026 05:15 PM Views : 274

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ???? ప్రజా భద్రత, రవాణా సౌకర్యాలే లక్ష్యంగా ప్రణాళికలు ???? రైల్వే శాఖ అనుమతులతో త్వరలోనే పనులు : కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రజల భద్రత, సాఫీగా రాకపోకలు సాగించేందుకు నియోజకవర్గ పరిధిలో రైల్వే వంతెనలు, గేట్ల నిర్మాణం అత్యంత ఆవశ్యకమని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. కొత్తగూడెం నియోజకవర్గంలోని పలు ప్రధాన ప్రాంతాలలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి, లెవల్ క్రాసింగ్‌లు, ఆర్వోబీ, ఆర్‌యూబీల మంజూరు కొరకు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్‌తో పాటు ఉన్నతాధికారులకు వినతిపత్రాలు సమర్పించి నిరంతరం కృషి చేస్తున్నామని మంగళవారం ఆయన తెలిపారు. ఈ ప్రయత్నాల ఫలితంగా మంగళవారం రైల్వే ఏడీఈ రవి, జేఈ జావిద్, ఆర్ అండ్ బి ఈఈ నాగేశ్వరరావు సంబంధిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన జరిపారని పేర్కొన్నారు. బూడిదగడ్డ వద్ద వర్షాల సమయంలో ఎదురయ్యే ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారంగా కొత్త ఆర్‌యూబీ లేదా గేటు ఏర్పాటు చేయాలని రైల్వే అధికారులను కోరినట్లు వెల్లడించారు. హేమచంద్రాపురం బైపాస్ రోడ్డుపై ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు ఆర్వోబీ, రైటర్ బస్తీ-గొల్లగూడెం మధ్య రవాణా సౌలభ్యం కోసం ఆర్‌యూబీ నిర్మాణాలను ప్రతిపాదించినట్లు వివరించారు. రామవరం-గరిమెళ్ళపాడు మధ్య సురక్షిత ప్రయాణానికి రైల్వే గేటు లేదా ఆర్‌యూబీ, అలాగే సింగరేణి మెయిన్ హాస్పిటల్ వద్ద రద్దీకి అనుగుణంగా ప్రస్తుత ఆర్వోబీ విస్తరణ పనులు త్వరలోనే పట్టాలెక్కేలా చర్యలు తీసుకుంటున్నామని, ఈ నాలుగు ప్రతిపాదనలకు త్వరలోనే మంజూరి లభించి నిధులు విడుదలవుతాయని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :