తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రజాప్రతినిధుల వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా రాయడం జర్నలిజం విలువలకు విరుద్ధం.ఊహాజనిత తప్పుడు వార్తలతో బురదజల్లే ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నాం. సిపిఐ ప్రజాప్రతినిధులపై అసత్య ప్రచారాలు చేయడం వెనుక ఎవరి హస్తముందో తేలుస్తాం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. ప్రజాప్రతినిధుల వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా వార్తలు రాయడం జర్నలిజం విలువలకు విరుద్ధమని, సిపిఐ ప్రజాప్రతినిధులపై బురదజల్లే ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నామని సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం పట్టణంలోని లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ హాల్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. పత్రికల్లో ఆధారాలు లేని ఊహాజనిత తప్పుడు వార్తలను ప్రచురించడం సరికాదన్నారు. సిపిఐ ప్రజాప్రతినిధులపై ఇలాంటి అసత్య ప్రచారాలు చేయడం వెనుక ఎవరి హస్తమైనా ఉందా అనే అంశాన్ని ఖచ్చితంగా తేల్చుకుంటామని ఆయన హెచ్చరించారు.మర్యాదపూర్వక భేటీని వక్రీకరించటం సరికాదు . 11వ డివిజన్ కార్పొరేటర్ పడాల ఆకాంక్ష.11వ డివిజన్ కార్పొరేటర్ పడాల ఆకాంక్ష మాట్లాడుతూ.. కుటుంబ సభ్యులతో కలిసి వ్యక్తిగత పనులపై హైదరాబాద్ వెళ్లిన క్రమంలో, తమ సామాజిక వర్గానికి చెందిన రాష్ట్ర నేత, ఎంపీ ఈటెల రాజేందర్ ను మర్యాదపూర్వకంగా మాత్రమే కలిశామని స్పష్టం చేశారు. అయితే దీనికి సంబంధించి ఓవ్యక్తి వాట్సాప్ స్టేటస్ ఫొటో ఆధారంగా ఓ పత్రిక సీపీఐ నుంచి బీజేపీలో చేరుతున్నట్లు వక్రీకరిస్తూ నిరాధారమైన వార్తలను ప్రచురించిందని మండిపడ్డారు. ఇలాంటి ఊహాజనిత కథనాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తే ఊరుకునేది లేదని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతమైతే చట్టపరమైన చర్యలు ఉంటాయని ఆమె హెచ్చరించారు. ఒక పార్టీ ప్రజా ప్రతినిధి మరో పార్టీ ప్రజా ప్రతినిధిని కలుసుకోవద్దనే ఆంచలి ఏమైనా ఉన్నాయా అని ఆమె ప్రశ్నించారు. తప్పుడు ఆరోపణలను ఆ పత్రిక యాజమాన్యం వెనక్కి తీసుకోవాలని స్పష్టం చేశారు. విలేకరుల సమావేశంలో కార్పొరేషన్ మేయర్ 3 గణేష్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సాలిగంటి శ్రీనివాస్, వి. పూర్ణచంద్రరావు, నేరెళ్ల రమేష్, నాయకులు పడాల భవాని తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ