Sunday, 02 August 2026 02:27:09 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

ప్రజాప్రతినిధుల వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా రాయడం జర్నలిజం విలువలకు విరుద్ధం.సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య

Date : 19 July 2026 06:47 PM Views : 210

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రజాప్రతినిధుల వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా రాయడం జర్నలిజం విలువలకు విరుద్ధం.ఊహాజనిత తప్పుడు వార్తలతో బురదజల్లే ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నాం. సిపిఐ ప్రజాప్రతినిధులపై అసత్య ప్రచారాలు చేయడం వెనుక ఎవరి హస్తముందో తేలుస్తాం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. ప్రజాప్రతినిధుల వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా వార్తలు రాయడం జర్నలిజం విలువలకు విరుద్ధమని, సిపిఐ ప్రజాప్రతినిధులపై బురదజల్లే ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నామని సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం పట్టణంలోని లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ హాల్‌ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌ లో ఆయన మాట్లాడారు. పత్రికల్లో ఆధారాలు లేని ఊహాజనిత తప్పుడు వార్తలను ప్రచురించడం సరికాదన్నారు. సిపిఐ ప్రజాప్రతినిధులపై ఇలాంటి అసత్య ప్రచారాలు చేయడం వెనుక ఎవరి హస్తమైనా ఉందా అనే అంశాన్ని ఖచ్చితంగా తేల్చుకుంటామని ఆయన హెచ్చరించారు.మర్యాదపూర్వక భేటీని వక్రీకరించటం సరికాదు . 11వ డివిజన్ కార్పొరేటర్ పడాల ఆకాంక్ష.​11వ డివిజన్ కార్పొరేటర్ పడాల ఆకాంక్ష మాట్లాడుతూ.. కుటుంబ సభ్యులతో కలిసి వ్యక్తిగత పనులపై హైదరాబాద్ వెళ్లిన క్రమంలో, తమ సామాజిక వర్గానికి చెందిన రాష్ట్ర నేత, ఎంపీ ఈటెల రాజేందర్ ను మర్యాదపూర్వకంగా మాత్రమే కలిశామని స్పష్టం చేశారు. అయితే దీనికి సంబంధించి ఓవ్యక్తి వాట్సాప్ స్టేటస్ ఫొటో ఆధారంగా ఓ పత్రిక సీపీఐ నుంచి బీజేపీలో చేరుతున్నట్లు వక్రీకరిస్తూ నిరాధారమైన వార్తలను ప్రచురించిందని మండిపడ్డారు. ఇలాంటి ఊహాజనిత కథనాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తే ఊరుకునేది లేదని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతమైతే చట్టపరమైన చర్యలు ఉంటాయని ఆమె హెచ్చరించారు. ఒక పార్టీ ప్రజా ప్రతినిధి మరో పార్టీ ప్రజా ప్రతినిధిని కలుసుకోవద్దనే ఆంచలి ఏమైనా ఉన్నాయా అని ఆమె ప్రశ్నించారు. తప్పుడు ఆరోపణలను ఆ పత్రిక యాజమాన్యం వెనక్కి తీసుకోవాలని స్పష్టం చేశారు. విలేకరుల సమావేశంలో కార్పొరేషన్ మేయర్ 3 గణేష్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సాలిగంటి శ్రీనివాస్, వి. పూర్ణచంద్రరావు, నేరెళ్ల రమేష్, నాయకులు పడాల భవాని తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :