తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మార్చి 8 న మహిళా దినోత్సవం సందర్బంగా 24 వ వార్డు లో విధులు నిర్వహిస్తున్న వివిధ రంగాల మహిళలను వారి సేవలను గుర్తిస్తూ ఆ వార్డు తాజా మాజీ కౌన్సిలర్ శ్రీమతి బాలిశెట్టి సత్యభామ సుందరరాజ్ గురువారం నాడు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి అంగన్వాడీ టీచర్స్ Sk గౌసియా, Sk జుబేధా, K రాజమణి, K సుజాత ఆశా వర్కర్ B గంగ, అంగన్వాడీ వర్కర్స్ M త్రివేణి, M సుజాత, K మల్లేశ్వరి డ్వాక్రా గ్రూప్ ఆర్పీ భాగ్యలక్ష్మి గారి ని సన్మానించారు సత్యభామ గారు మాట్లాడుతూ గృహిణి గా కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూ సమాజంలో వివిధ రంగాలలో కూడా రాణిస్తున్న మహిళామణులను ప్రోత్సహిస్తూ వారి సేవలను గుర్తిస్తూ ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశామని తెలిపారు ఈ కార్యక్రమం లో కనకం ఈశ్వరమ్మ ప్రత్యూష విద్యా స్వరూప తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ