తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం డిసెంబర్ 25 తెలుగు వెలుగు) : జూలూరుపాడు జాతీయ రహదారి భారత్ పెట్రోల్ బంక్ సమీపంలో అర్థరాత్రి ఆటోను లారీ ఢీ కొట్టింది ఈ ప్రమాదంలో ఆటోలో ఇద్దరు వ్యక్తులు ఉండగా ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు ఇంకొక వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. మృతుడు పాల్వంచ రూరల్ మండలానికి చెందిన తగిరస శివ (28 ) గా గుర్తించారు.పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని బాడీని పోస్టుమార్టం నిమిత్తం కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
Admin
తెలుగు వెలుగు టీవీ