తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : బీసీ రిజర్వేషన్ల సాధనకు వివిధ బీసీ సంఘాలతో ఏర్పడిన బీసీ జేఏసీ బంద్ పర్ జస్టిస్ పేరుతో ఈనెల 18న తలపెట్టిన రాష్ట్ర బందుకు ముస్లిం మైనార్టీ లో సంపూర్ణ మద్దతు ప్రకటించింది రామవరం ఈద్గా ఖబర్ఖాన్ కమిటీ అధ్యక్షులు ఫహీమ్ దాదా మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లు సాధనకు తెలంగాణ ఉద్యమ తరహాలోనే ఒక సామాజిక ఉద్యమంగా ముందుకు కాగలన్నారు, బిసి బిల్లును ఆమోదించి రిజర్వేషన్లను అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉందన్నారు, గవర్నర్ వద్ద పెండింగ్ ఉన్న బిల్లులు నిర్ణయిత కాల పరిమితిలోగా ఆమోదం లభించేయకపోతే నోటుపై చేయవచ్చని తమిళనాడు కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పరిశీలించాలన్నారు, రాష్ట్రం నుండి ప్రతినిత్యం వహిస్తున్న బిజెపి ఎంపీలు మంత్రులు కేంద్రంపై ఒత్తిడి తేవడానికి ఎలాంటి ప్రయత్నం చేయడం లేదన్నారు కేంద్రంలో అధికారంలో బిజెపి ఉండటం వల్లనే రిజర్వేషన్లు అమలు కానీ పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు కావాలంటే రాష్ట్రంలో కేంద్రంలో బిజెపిని భూస్థాపితం చేయాలన్నారు, ఈ సమావేశంలో, సెక్రెటరీ రసూల్ పాషా, షమీరుద్దీన్, అసాద్, జావీద్, ఖయ్యూం, సూపర్ ఖురేషి, ఉస్మాన్, అంకుష్, మస్తాన్, మజీద్, జలీల్, జానీ, సలీం, యాకూబ్, ఇస్మాయిల్, సుల్తాన్, తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ