Sunday, 07 June 2026 08:46:59 AM
# బిజెపి పార్టీ సీనియర్ నాయకులు సొప్పరి క్రాంతి ఆధ్వర్యంలో గౌతంపూర్ లో మొక్కలు నాటడం జరిగినది. # ఈ నెల 7, 8 తేదీల్లో రెండు రోజులపాటు ఎఐటీయూసీ సెంట్రల్ కౌన్సిల్ సమావేశం. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి. # మున్సిపల్ కార్పొరేషన్‌లో సిపిఐ పక్ష బలాన్ని సమర్థవంతంగా చాటాలి.కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు # నామా వినోద్‌పై దాడి చేసిన భూకబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. # మీసేవ దరఖాస్తుల పరిశీలన పూర్తిగా ఆన్‌లైన్‌లోనే. జీపీఓలు, ఆర్‌ఐలకు అవగాహన కల్పించిన ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ సైదేశ్వరరావు. # ప్రజల ప్రాణ రక్షణకు ముందస్తు చర్యలు చేపట్టాలి. గోదావరి వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మరో రెండు రోజుల్లో రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకనున్న నేపథ్యంలో జిల్లాలో వరి కొనుగోలు ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలి. # భద్రాచలం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అయ్యప్ప కాలనీ, రెవిన్యూ కాలనీల్లో కార్డాన్ అండ్ సెర్చ్ ఆపరేషన్. # విద్యార్థులు సాంస్కృతిక పోటీల్లో రాణించాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # పెట్రోలింగ్,బ్లూ కోల్డ్స్ వాహనాలతో సంచరిస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మాస్టర్ ఈ .కె ఆధ్యాత్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో కాకర్ల గ్రామం నందు ఉచిత హోమియో వైద్య శిబిరం. # భూభారతి, సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సెంట్రల్ పార్కులో ప్లాస్టిక్ ఏరివేత -మొక్కలు నాటిన ఎస్ జి ఎఫ్. # కొత్తగూడెం ఇల్లందు రహదారిపై స్కూటీని ఢీకొన్న లారీ. # పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ధరల పెరుగుదలపై రాజీలేని పోరాటం చేద్దాం.సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # గోపన్నగూడెంలో మినీ మేడారం జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే జారె. # జనగణన జాబితా వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేలా ఉండాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # సమున్నత ఆశయాలతోనే భారత జాతీయ మహిళా సమాఖ్య ఆవిర్భావం. భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి మున్నా లక్ష్మీకుమారి. # ప్రజా సమస్యల పరిష్కార మార్గాన్ని చూపే విధంగా గ్రామ సభలు ఉండాలి. 16వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ.

విద్యార్థులకు కావలసిన జ్ఞానాన్ని అందించేది ఉపాధ్యాయులే.... జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్.

Date : 21 August 2024 02:51 PM Views : 1073

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : విద్యార్థులకు కావలసిన జ్ఞానాన్ని అందించవలసిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని, ప్రస్తుత కాలమాన పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులను తయారుచేసి వారికి మంచి భవిష్యత్తును అందించడంలో ఉపాధ్యాయులకు కీలక పాత్ర పోషిస్తారని జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ అన్నారు. జిల్లాలో ఇటీవల పదోన్నతి పొందిన ఉపాధ్యాయులకు రెండు రోజుల పాటు కొత్తగూడెంలోని జిల్లా విద్యా శిక్షణా కేంద్రంలో నిర్వహించనున్న శిక్షణా తరగతులను ప్రారంభిస్తూ...ముందుగా పదోన్నతి పొందిన ఉపాధ్యాయులకు అభినందనలు తెలుపుతూ, ఇప్పటివరకు ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు కావాల్సిన సామర్ధ్యాలు అందించడంలో విశేష కృషి చేశారని ప్రస్తుతం పదోన్నతి ద్వారా ఉన్నత పాఠశాలకు వెళ్లడం వల్ల అక్కడ పరిస్థితులు, పిల్లలు, బోధన విధానాలు, పరీక్ష విధానాలు వేరుగా ఉంటాయి కాబట్టి ఈ శిక్షణ ఎంత ఉపయోగపడుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ శిక్షణ ద్వారా నేర్చుకున్న అంశాలను పాఠశాలల్లో అమలుపరచడం ద్వారా మంచి భవిష్యత్తు తరాలని తయారు చేయాలని, కేవలం ఈ శిక్షణలోనే కాకుండా సీనియర్ ఉపాధ్యాయుల నుండి నిరంతరం విషయాలను తెలుసుకొని నాణ్యమైన బోధన్ అందించాలని సూచించారు.

జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీఎం వెంకటేశ్వర చారి మాట్లాడుతూ జిల్లాలో 680 మంది ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు పదోన్నతి పండగ మొదటి విడతలో 130 మంది ఇంగ్లీష్ ఫిజిక్స్ మరియు సోషల్ సబ్జెక్టులకు సంబంధించిన ఉపాధ్యాయులకు రెండు రోజులపాటు శిక్షణ అందిస్తున్నామని దీనిని సద్వినియోగం చేసుకొని సందేహాలు అన్నిటిని నివృత్తి చేసుకొని పాఠశాలలో నాణ్యమైన బోధన అందించాలని నూతన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమానికి శిక్షణా సమన్వయకర్తగా జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి నాగ రాజశేఖర్ వ్యవహరించగా, జిల్లాలో పై సబ్జెక్టులలో పదోన్నతి పొందిన 130 మంది ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు 15 మంది డిఆర్పీలు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :