తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సిపిఐ లక్ష్మీదేవిపల్లి 4వ మండల మహాసభ మండలంలోని హమాలి కాలనీ నందు శుక్రవారం జరిగింది. ఈ మహాసభలో ఏఐవైఎఫ్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. లక్ష్మీదేవిపల్లి మండల అధ్యక్షులుగా లగడపాటి రమేష్, ప్రధాన కార్యదర్శిగా చంద్రగిరి ప్రసాదరావు, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా వినోద్ కుమార్, ఉపాధ్యక్షులుగా జర్పులహరి, బానోత్ పరశురాం, సహాయ కార్యదర్శిలుగా లావుడియా రాము, తేలూరి నరసింహారావు లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఎన్నికైన వారు మాట్లాడుతూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చంద్రగిరి శ్రీనివాసరావు తమపై నమ్మకంతో పదవీ బాధ్యతలు అప్పజెప్పినందుకు ధన్యవాదములు తెలిపారు. ప్రస్తుత సమాజంలో యువత ఎదుర్కొంటున్న సమస్యల పై ఉద్యమాలు చేసి పరిష్కారం దిశగా పనిచేస్తామని తెలిపారు
Admin
తెలుగు వెలుగు టీవీ