Thursday, 14 May 2026 01:03:26 AM
# అశ్వారావుపేటకు హార్టికల్చర్ కళాశాల తీసుకొచ్చిన ఎమ్మెల్యే జారె. # అన్నపురెడ్డిపల్లి చెరువు వద్ద పేకాట శిబిరంపై పోలీసుల దాడిలో నలుగురు అరెస్ట్. # బి ఆర్ ఎస్ కమిటి ఆధ్వర్యంలో ఆందోళన చేసిన మండల ఉపాధ్యక్షులు మద్దిరాల చిన్న పిచ్చయ్య. # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే జారె. # సైబర్ సెక్యూరిటీపై అవగాహన కల్పించిన టేకులపల్లి ఎస్సై జుబేదా బేగం. # కలెక్టర్ చేతుల మీదుగా బ్యాటరీ వీల్ చైర్ పంపిణీ. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # జిల్లాలో లాడ్జిలను నడిపించే యాజమాన్యాలు నిబంధనలను కచ్చితంగా పాటించాలి. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # ఎన్సీసీ క్యాడెట్లకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించిన ట్రాఫిక్ పోలీసులు. # కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం వల్ల అన్ని వర్గాలకు లబ్ధి చేకూరుతుంది. ఎమ్మెల్యే జారె. # అశ్వారావుపేట నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే జారె. # జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన బాంబు డిస్పోజల్ బృందం సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పర్సనల్ మేనేజర్ తిరుపతి నీ సన్మానించిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం. # పుల్లాయిగూడెం శ్రీసీతారామాంజనేయస్వామి ఆలయ పూజలో పాల్గొన్న టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు . # రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం గుండుగులపల్లి కార్యక్రమంలో వివరించిన ఎమ్మెల్యే జారె. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్. # విపత్తుల నిర్వహణ మాక్ ఎక్సర్సైజ్‌లకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # ఆసుపత్రులు,డయాగ్నస్టిక్ సెంటర్లకు అనుమతులు తప్పనిసరి. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : జిల్లా కలెక్టర్ అంకిత్. # తమిళనాడు గవర్నర్ వ్యవహారం హాస్యాస్పదం. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # పట్టుదల,క్రమశిక్షణ కలిగి ఉంటే ఉన్నత శిఖరాలను సులభంగా అధిగమించవచ్చు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు.

మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా మరియు ర్యాగింగ్ వ్యతిరేక అవగాహనా కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్.

Date : 11 September 2025 06:36 PM Views : 556

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మాదక ద్రవ్యాల రహిత సమాజ స్థాపనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. యువత,విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా ఉన్నత లక్ష్యసాధనకై కృషి చేయాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ అన్నారు. పాల్వంచ (నవభారత్) KSM ఇంజినీరింగ్ కళాశాల నందు ఏర్పాటు చేసిన అవగాహనా కార్యక్రమానికి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.డ్రగ్స్ నిర్మూలన కోసం జరుగుతున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎస్పీ తెలిపారు.విద్యార్థుల దృష్టి తమ భవిష్యత్తు,జీవిత లక్ష్యంపై మాత్రమే ఉండాలని,నిషేధిత గంజాయి, డ్రగ్స్ మరియు ఇతర మత్తు పదార్థాల వాడకం పట్ల విద్యార్థులు,యువత ఆకర్షితులు కావద్దని జిల్లా అన్నారు.గంజాయి, డ్రగ్స్ అలవాటు వలన శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని పాడుచేస్తుందని కావున చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు.మాదక ద్రవ్యాల నిర్మూలన గంజాయి రహిత జిల్లానే లక్ష్యంగా భద్రాద్రి కొత్తగూడెం పోలీసు శాఖ కృషి చేస్తోందని అందులో బాగంగా విద్యాసంస్థలు,గ్రామాల్లో అవగాహనా కార్యక్రమాలు నిరంతరం నిర్వహించడం జరుగుతుందని అన్నారు.మత్తుకు బానిస అవడానికి అనేక కారణాలు ఉంటాయి పరిసరాల ప్రభావం,చెడు స్నేహితులు,సన్నిహితుల వలన చెడు మార్గాల వైపు వెళ్ళవద్దని సూచించారు.గంజాయి,డ్రగ్స్‌ జీవితాన్ని నాశనం చేయడంతో పాటు భవిష్యత్‌ లేకుండా చేస్తుందనే విషయాన్ని విద్యార్థులు, యువత గ్రహించి అలాంటి చెడు అలవాట్లకు ఆకర్షితులవ్వద్దని విజ్జప్తి చేశారు.మత్తు పదార్థాలను అరికట్టేందుకు యువత,విద్యార్థులు అంతా యాంటీ డ్రగ్స్ కమిటీలలో సభ్యులుగా చేరి యాంటీ డ్రగ్స్ సోల్జర్ గా సహకరించాలని తెలిపారు. డ్రగ్స్ నివారణలో తమ వంతు పాత్ర పోషించాలని సూచించారు. యువత యొక్క ప్రవర్తనను ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు గమనిస్తూ వారు ఎలాంటి చెడు అలవాట్లకు బానిసలు కాకుండా గమనిస్తూ ఉండాలని సూచించారు. మీ మీ ప్రాంతాలలో ఎక్కడైనా గంజాయి ఇతర మత్తు పదార్థాలు విక్రయిస్తున్నట్లు, తాగుతున్నట్లు తెలిస్తే వెంటనే సంబధిత సమాచారాన్ని స్థానిక పోలీసులకు ఇవ్వాలని కోరారు.యువతను లక్ష్యంగా చేసుకొని గంజాయి,డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలను అమ్ముతున్న వారిపై కేసులు నమోదు చేశామన్నారు.ఈ కార్యక్రమంలో సుమారుగా 500 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అదే విధంగా విద్యార్థులు ఎవరైనా ర్యాగింగ్ నకు పాల్పడితే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.విద్యార్థులకు ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే స్థానిక పోలీసుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు.ప్రస్తుత కాలంలో సైబర్ నేరగాళ్లు ఎన్నో రకాలుగా అమాయకుల ఖాతాల్లో నుండి నగదును కాజేస్తున్నారని,ఎప్పటికప్పుడు సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగియుండి తమ చుట్టుప్రక్కల వారికి కూడా అవగాహనా కల్పిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ముఖ్యంగా విద్యార్దినులు సోషల్ మీడియా వినియోగించేటప్పుడు అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ డిఎస్పీ సతీష్ కుమార్, ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, కళాశాల ప్రిన్సిపాల్ జగన్మోహన్ రావు మరియు పాల్వంచ ఎస్సై సుమన్,కళాశాల అధ్యాపాకులు మరియు విద్యార్డినీ, విద్యార్థులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :