Wednesday, 16 September 2026 11:25:26 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

జిల్లాలో విపత్తుల నిర్వహణకు ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ (EOC)ను పటిష్టంగా అమలు చేయాలి - జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

Date : 20 December 2025 05:16 PM Views : 262

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : 22న బూర్గంపాడు లో మాక్ డ్రిల్.. ప్రకృతి వైపరీత్యాలు, ఇతర విపత్తుల సమయంలో సమర్థవంతమైన స్పందనతో ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించేందుకు ముందస్తు అప్రమత్తత అత్యంత అవసరమని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ఈ నెల 22వ తేదీన విపత్తుల నిర్వహణపై మాక్ డ్రిల్ నిర్వహించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. శనివారం ఐడీఓసీ కార్యాలయ సమావేశ మందిరంలో భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందనలతో కలిసి విపత్తుల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ (EOC)ను జిల్లాలో పటిష్టంగా అమలు చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విపత్తుల సమయంలో వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లాలో EOC కీలక పాత్ర పోషిస్తుందని, ఇందులో జిల్లా స్థాయి అధికారులు,రెవెన్యూ, ఇరిగేషన్, వైద్య, ఫైర్, పోలీస్, SDRF, NDRF తదితర విభాగాలు సభ్యులుగా ఉండాలని తెలిపారు. EOC ద్వారా విపత్కర పరిస్థితుల్లో చేపట్టవలసిన జాగ్రత్తలు, ముందస్తు చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు అవసరమైన సామాగ్రి, వనరులు, పటిష్టమైన కార్యాచరణ ప్రణాళిక సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. విపత్తు పరిస్థితులను ముందుగానే అంచనా వేయగలిగితే నష్టాలను గణనీయంగా తగ్గించవచ్చని కలెక్టర్ తెలిపారు. ఇందుకోసం అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, విధుల్లో ఎలాంటి అలసత్వం లేకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో సమాచార మార్పిడి అత్యంత కీలకమని, అందుబాటులో ఉన్న అన్ని సమాచార, సాంకేతిక సాధనాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని స్పష్టం చేశారు.వర్షపాతం వివరాలు, ప్రాజెక్టులు మరియు రిజర్వాయర్ల నీటిమట్టం, నీటి విడుదల, వంతెనలు, రోడ్ల ప్రస్తుత పరిస్థితి వంటి అంశాలపై రియల్ టైమ్ సమాచారం ప్రజలకు చేరవేయాలని ఆదేశించారు. అలాగే జిల్లా మ్యాప్‌తో పాటు అవసరమైన అన్ని మ్యాపులు సిద్ధంగా ఉంచాలని, వరదలు సంభవించినప్పుడు క్షేత్రస్థాయిలో చేపట్టవలసిన చర్యలు, పునరావాస కేంద్రాల గుర్తింపు, పునరావాస కేంద్రాల్లో కల్పించవలసిన సదుపాయాలు ముందుగానే సిద్ధం చేసుకోవాలని తెలిపారు. అత్యవసర సమయాల్లో ప్రజలకు అవసరమయ్యే ఆరోగ్య, అగ్నిమాపక, పోలీస్, రెవెన్యూ, విద్యుత్, తాగునీరు, మునిసిపల్ సేవలు తదితర విభాగాలకు సంబంధించిన టోల్ ఫ్రీ నంబర్లు, హెల్ప్‌లైన్ వివరాలు ప్రజలందరికీ తెలిసేలా విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. లైఫ్ జాకెట్లు, బోట్లు, ఇతర రక్షణ సామాగ్రి అందుబాటులో ఉంచాలని, పోలీస్ విభాగం నుంచి అవసరమైన సమాచార వ్యవస్థను పటిష్టం చేయాలని ఆదేశించారు. గోదావరి నది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహించినప్పుడు తీసుకోవలసిన చర్యలపై స్పష్టమైన కార్యాచరణ ఉండాలని, దీనిని ఆచరణలో పరీక్షించేందుకు ఈ నెల 22న బూర్గంపాడులో మాక్ డ్రిల్ నిర్వహించాలని, అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. మాక్ డ్రిల్ సందర్భంగా విపత్తు నిర్వహణ ప్రణాళికల అమలు, శాఖల మధ్య సమన్వయం, స్పందన వేగం, రక్షణ చర్యలు, సహాయక సేవల అందుబాటు వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించాలని తెలిపారు. ఈ మాక్ డ్రిల్ ద్వారా లోపాలను గుర్తించి, వాటిని సరిదిద్దుకొని వాస్తవ విపత్తుల సమయంలో మరింత సమర్థవంతంగా పనిచేయవచ్చని తెలిపారు. విపత్తుల నిర్వహణలో ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యమని, ప్రతి అధికారి తన పరిధిలోని సిబ్బందికి తగిన శిక్షణ అందించి, బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తిస్తూ ప్రజల ప్రాణాలను కాపాడే దిశగా కట్టుదిట్టంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో డిప్యూటీ కలెక్టర్ మురళీ, జెడ్పి సీఈవో నాగలక్ష్మి, సిపిఓ సంజీవరావు పంచాయతీరాజ్ ఈ ఈ శ్రీనివాసరావు, ఆర్ టి ఓ వెంకటరమణ సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :