తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : డిప్యూటీ మేయర్ లలిత కుమారి, సోసైటీ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చీకటి కార్తీక్.11 మంది లబ్ధిదారులకు 5 లక్షల విలువైన చెక్కులు పంపిణి జూన్ 03 : నిరుపేద కుటుంబాలకు సిఎం రిలీఫ్ ఫండ్ వరం లాంటిదని డిప్యూటీ మేయర్ లలితా కుమారి, పాల్వంచ సోసైటీ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చీకటి కార్తీక్ అన్నారు. బుధవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఇటీవల కాలంలో పలు అనారోగ్య కారణాలతో ప్రయివేట్ ఆసుపత్రులలో చికిత్స పొందిన వారికి, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘు రాంరెడ్డి సిఫారసు ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన సుమారు 5 లక్షల విలువ గల చెక్కులను 11మంది లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తూ ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తుందని ప్రజలు ఇలానే ఆదరిస్తే భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ పథకాలు అందిస్తూ ప్రజలు ఆర్థికంగా అభివృద్ధికి తోడుగా నిలుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటీసీ కొండా వెంకన్న, యర్రంశెట్టి ముత్తయ్య, తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ