తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రామవరం 16 వ డివిజన్ లో అంబేద్కర్ చమన్ నెహ్రు బస్తీ ఏరియాలోని ప్రజలు 16 వ డివిజన్ కార్పొరేటర్ దంపతులు మునిగడప పద్మ వెంకటేశ్వర్లను ఘనంగా సన్మానించి కేక్ కట్ చేయించి వారి అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా సోమవారం జరిగిన సన్మాన సభలో మునిగడప పద్మ మాట్లాడుతూ16వ డివిజన్ ప్రజల ఆదరాభిమానాలకు, ఆప్యాయతకు, వారు గత మూడు పర్యాయాలు మాకు ఇచ్చిన విజయానికి జీవితాంతం రుణపడి ఉంటామని ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రానున్న ఈ ఐదు సంవత్సరాల్లో డివిజన్ ప్రజల కష్టసుఖాల్లో, వారికి ప్రభుత్వం నుండి రావలసిన సంక్షేమ ఫలాల విషయంలో కూడా అందుబాటులో ఉండి అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. 16వ డివిజన్ ను అభివృద్ధిలో నడిపించడానికి స్థానిక శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు మరియు సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే షాబీర్ పాషా సహకారాన్ని తీసుకొని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తమ వంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు హామీ ఇచ్చారు. ఈ సన్మాన కార్యక్రమం లో శాంతక్క, ఎన్ సరోజిని ,కరుణమ్మ, కంచర్ల రవి, లీల, సారయ్య ,పద్మ, సంగీతరావు, క్రిస్టఫర్, కన్నమ్మ ,రాజేశ్వరి, రాధ, దొంగ హేమలత, సింధు, బస్తి పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ