Thursday, 02 July 2026 05:40:49 AM
# సింగరేణి గడ్డ మరోసారి పోరాటాల గడ్డగా మారింది. జేఏసీ ఆధ్వర్యంలో కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముట్టడి విజయవంతం.వేలాది కార్మికులతో మార్మోగిన డిమాండ్ల డే. # నేషనల్ హైవే అధికారుల నిర్లక్ష్యం తగదు.కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # కల్యాణ లక్ష్మి, షాదిముబారక్ పథకాలు పేద కుటుంబాలకు కొండంత అండ. కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # అర్హులైన ప్రతి రైతుకు రైతు భరోసా పథకం ప్రయోజనాలు పారదర్శకంగా అందిస్తాం: జిల్లా కలెక్టర్ అంకిత్. # జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారామ్ రాథోడ్ ఆధ్వర్యంలో పదవీ విరమణ పొందిన వైద్య సిబ్బందికి సన్మానం. # కార్మికుల న్యాయమైన వేతన హక్కులను కాలరాయొద్దు – 12వ వేతన కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలి. # వట్టికొండ రజిని జయంతి సందర్భంగా పేదలకు నిత్యావసర సరుకులు, బట్టల పంపిణీ. # నూతన జిల్లా పోలీస్ కార్యాలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీని గడువులోపు పూర్తి చేయాలి : రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుధర్శన్ రెడ్డి. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని రాష్ట్ర పరిశీలక బృందం సందర్శించింది. # ప్రజలకు నిర్విరామంగా సేవలందించిన ఉద్యోగుల సేవలు చిరస్మరణీయం: జిల్లా కలెక్టర్ అంకిత్. # ఓటర్ల జాబితా సవరణలో బిఎల్ఏల పాత్ర కీలకం. బిఎల్ఏల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # వామపక్ష నాయకుల అక్రమ అరెస్టులు అప్రజాస్వామికం.అరెస్టు చేసిన కూనంనేనిని, ఇతర నేతలను భేషరతుగా విడుదల చేయాలి. # వామపక్ష నాయకుల అక్రమ అరెస్టులు అప్రజాస్వామికం. సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # ఇండ్లు లేని పేదల పక్షాన సమిష్టిగా పోరాడుదాం.సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు. # మొహరం పండుగ త్యాగానికి, సేవకు నిదర్శనం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # తల్లిదండ్రుల మందలించడంతో మనస్తాపం చెంది కొడుకు ఆత్మహత్య. # పద్ధతి మార్చుకోండి లేదంటే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవు రౌడీషీటర్లకు డీఎస్పీ అరుణ్ కుమార్ కౌన్సిలింగ్. # ​ బైక్ అదుపుతప్పి కరెంట్ పోల్‌ను ఢీకొట్టిన ప్రమాదంలో సమ్మయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి. # ప్రాచీన సంస్కృతీ సాంప్రదాయాలను కాపాడుకుందాం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా.

కొమ్ముగూడెం గ్రామానికి చెందిన వ్యక్తి ఆత్మహత్య, మృతుడు కుమారుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఎస్సై రవి.

Date : 30 October 2025 07:08 PM Views : 1599

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూలూరుపాడు మండలం, కొమ్ముగూడెం గ్రామానికి చెందిన భానోతు కబీర్ దాస్ ,తండ్రి పేరు: లచ్చు, 45 సంవత్సరాలకు మాచినపేట రెవెన్యూ పరిధిలో 0.35 గుంటల వ్యవసాయ భూమి ఉన్నదని, అట్టి భూమిని కబీర్ దాస్ అన్న కొడుకు అయిన బానోతు లింగ ఆక్రమించుకొని, భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసినాడని, అట్టి భూమి లింగాదే అంటూ బానోతు హేమ్ల తప్పుడు కాగితాలు రాసినాడని, అదే భూమిని కబీర్దాస్ పేరుమీద పట్టా చేయిస్తానని గుగులోతు కృష్ణ అనే అతను మూడు లక్షల రూపాయలు కబీర్ దాస్ వద్ద తీసుకున్నాడని, మరోపక్క గ్రామ పెద్దమనిషి అయిన భానోతు కిషన్ కలుగజేసుకుని అట్టి భూమి కబీర్దాస్ పేరుమీద పట్టా చేయించవద్దంటూ లింగాపై ఒత్తిడి చేశాడని, అయితే మృతుడు కబీర్ దాస్ తన భూమి చుట్టూ లింగా వేసిన ఫెన్సింగ్ తీయించాలని, లింగ మరియు సునీతలను వేడుకున్నను, మృతుడి మాటలు లెక్కచేయకుండా ఏం చేసుకుంటావో, చేసుకో అని బూతులు తిట్టినారని, బానోతు లింగ మరియు లింగా భార్య సునీతలు బానోతు హేమ్ల, గుగులోతు కృష్ణ, బానోతు కిషన్ ల ప్రోత్బలంతో కబీర్ దాస్ ను అనేక ఇబ్బందులకు గురి చేయగా, వారు పెట్టిన ఇబ్బందులు తాళలేక మరియు తన భూమి తనకు దక్కకుండా పోతుందేమోనన్న భయముతో కబీర్ దాస్ తేదీ 21.10.2025న ఇంట్లోనే ఏదో గుర్తు తెలియని పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో పడి ఉండగా, కుటుంబ సభ్యులు గమనించి, చికిత్స కొరకు కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి, ఆపై ఖమ్మంలోని ప్రైవేట్ ఆసుపత్రికి, మరల అచ్చటి నుండి కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయించినను కబీర్ దాస్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడక, కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రి నందే చికిత్స పొందుతూ ,ఈరోజు ఉదయం 5 గంటల సమయంలో మృతి చెందినాడని,మృతుడి కుమారుడు భానోత్ నందు, 19 సంవత్సరములు, ఫిర్యాదు ఇవ్వగా జూలూరుపాడు పోలీస్ స్టేషన్ ఎస్ఐ రవి బానోతు లింగ, సునీత, బానోతు హేమల, గుగులోతు కృష్ణ, బానోత్ కిషన్ లపై కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేసినారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :