తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూన్ 9న హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించనున్న మండల మహిళా సమాఖ్య ఆర్టిసి బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి తగిన చర్యలు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు.మరో రెండు రోజుల్లో రుతుపవనాలు తెలంగాణ రాష్ట్రాన్ని తాకనున్న నేపథ్యంలో జిల్లాలో వరి కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కలెక్టర్లను అదేశించారు.శనివారం, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు వరి కొనుగోలు ప్రక్రియ, జూన్ 9న జరిగే మండల మహిళా సమాఖ్య సభ్యులకు ఆర్టీసీ బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమంపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐ డి ఓ సి కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి *అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కలిసి కలెక్టర్ అంకిత్ హాజరయ్యారు.జిల్లాలోని అన్ని కొనుగోలు కేంద్రాల నుంచి తూకం వేసిన వడ్లు వెనువెంటనే లారీల్లో మిల్లులు, గోదాములకు తరలించాలన్నారు. రెండు మూడు రోజుల్లో కొనుగోలు ప్రక్రియ పూర్తి అయ్యే విధంగా చూడాలని సూచించారు.జూన్ 9వ తేదీన హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో మండల మహిళా సమాఖ్యలకు ఆర్టీసీ బస్సుల పంపిణీ కార్యక్రమంజిల్లాల్లోని అన్ని బస్సులు ఆయా మండలాల నుంచి మహిళా సంఘాల సభ్యులను తీసుకొని సాయంత్రం 4 గంటల లోపల హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ కి చేరుకునే విధంగా చూడాలని సూచించారు. మహిళలకు మార్గమధ్యలో భోజనాలు, తాగు నీరు, తదితర మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా ప్రణాళికలు చేసుకోవాలన్నారు.నీట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహించాలని, కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని జాగ్రత్తలు పాటించాలన్నారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, డి సి ఓ ప్రేమ్ కుమార్, డీఎం సివిల్ సప్లై అధికారి త్రినాథ్ బాబు, ఇంటర్మీడియట్ అధికారి వెంకటేశ్వర్లు, కలెక్టరేట్ సూపర్నెంట్ వెంకటరమణ,విద్యా శాఖ ఇతర సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ