Saturday, 18 April 2026 05:07:17 PM
# ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్. # ఐదు గ్రామపంచాయతీల కోసం సమరభేరి - సోమవారం భద్రాచలంలో భారీ సభ - హాజరుకానున్న రేణుకా చౌదరి. # అంగన్వాడి కేంద్రాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. # 'ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా జిల్లా డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో అలవాటుగా మారే మందుల దుర్వినియోగంపై సమగ్ర అవగాహన సదస్సు . # అణగారిన వర్గాలకు అక్షరజ్యోతి ఫూలే. జ్యోతిరావు ఫూలే జీవితం ఎందరికో ఆదర్శం. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి : జిల్లా వైద్యశాఖ అధికారి డా. తుకారాం రాథోడ్. # సాదా బైనమా దరఖాస్తుల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ .

సంపూర్ణత అభియాన్‌ 2.0 లక్ష్యాలను సమష్టిగా సాధిద్దాం : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

Date : 05 February 2026 08:11 PM Views : 75

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : నీతి ఆయోగ్‌ ఆధ్వర్యంలో అమలవుతున్న సంపూర్ణత అభియాన్‌ 2.0 లక్ష్యాలను జిల్లా స్థాయిలోను, గుండాల మండలంలోను సమన్వయంతో సాధిద్దామని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. నీతి ఆయోగ్‌ ఆస్పిరేషనల్ జిల్లా, ఆస్పిరేషనల్ మండలం (ఆకాంక్షిత మండలం) కార్యక్రమంలో భాగంగా గురువారం గుండాల మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో నిర్వహించిన సంపూర్ణత అభియాన్‌ 2.0 కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ముందుగా గుండాల గ్రామ కూడలి నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వరకు నిర్వహించిన అవగాహన ర్యాలీలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో మొక్కలు నాటారు. సంపూర్ణత అభియాన్‌ 2.0 క్యాంపెయిన్‌ను ప్రారంభిస్తూ జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ క్యాంపెయిన్‌ జనవరి 28 నుంచి ఏప్రిల్ 14 వరకు నిర్వహించబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాబోయే రోజుల్లో జిల్లా వ్యాప్తంగా అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో త్రాగునీరు, మరుగుదొడ్ల సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. ప్రతి నెలా అంగన్వాడీ కేంద్రాల్లో నమోదు అయిన పిల్లల ఎత్తు, బరువు కచ్చితంగా కొలిచి నమోదు చేయాలని, పిల్లలను గుర్తించి వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.అంగన్వాడీ కేంద్రాల్లో నమోదు అయిన 6 నెలల నుంచి 6 సంవత్సరాల వయస్సు గల పిల్లలందరికీ బాలామృతం మరియు ఇతర పోషక ఆహారాన్ని తప్పనిసరిగా అందించాలని సూచించారు.గుండాల మండలంలోని గ్రామ సర్పంచులు తమ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి, పిల్లలకు అవసరమైన పోషకాహారం అందేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆశ మరియు ఏఎన్ఎంలు వ్యాధి నిర్ధారణ పరీక్షల ద్వారా క్షయ (టీబీ) బాధితులను గుర్తించి, వారికి అవసరమైన చికిత్స అందించడంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులకు సూచించారు.జిల్లా పశు వైద్య అధికారులు అన్ని పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయాలని ఆదేశించారు. అదే విధంగా గుండాల మండలంలో ఉన్న పశువుల సంఖ్య ఆధారంగా అవసరమైన పశుగ్రాసాన్ని రైతులు సాగు చేయాలని సూచించారు. దీనివల్ల పశువులకు సరిపడా మేత లభిస్తుందని తెలిపారు.ఈ సందర్భంగా సంపూర్ణత అభియాన్‌ 2.0 పోస్టర్లను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించి కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు.సంపూర్ణత అభియాన్‌లో జిల్లాను, గుండాల మండలాన్ని ప్రథమ స్థానంలో నిలపడానికి అధికారులు సమష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ అన్నారు. క్షేత్రస్థాయిలో ఉద్యోగులు, అంగన్వాడీ సిబ్బంది, ఆశ కార్యకర్తలు, ఆరోగ్య కార్యకర్తలు, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పని చేసి అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.ఈ కార్యక్రమంలో హెల్త్ & న్యూట్రిషన్, విద్య, పశు వైద్య శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను జిల్లా కలెక్టర్ పరిశీలించి తగిన సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి నాగలక్ష్మి, సిపిఓ సంజీవ రావు, మహిళా శిశు సంక్షేమ శాఖాధికారి లెనినా స్వర్ణలత, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ తుకారాం నాయక్, జిల్లా పశు సంవర్థక శాఖాధికారి వెంకటేశ్వర్లు, గుండాల మండలం ఎంపీడీవో బాలరాజు, ఆస్పిరేషనల్ బ్లాక్ ఫెలో నవనీత్, అంగన్వాడీ టీచర్లు, కార్యకర్తలు, ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు, పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :